Telugu News » DK Aruna: రాముడి పేరుతో రాజకీయాలు మానుకోవాలి: డీకే అరుణ

DK Aruna: రాముడి పేరుతో రాజకీయాలు మానుకోవాలి: డీకే అరుణ

2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయడానికి డీకే అరుణ రూ.15కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సవాల్‌ను డీకే అరుణ స్వీకరించారు. వంశీచంద్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

by Mano
DK Aruna: Avoid politics in the name of Ram: DK Aruna

రాముడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే.అరుణ(Ex Minister DK Aruna) అన్నారు. కాంగ్రెస్ ఎఐసీసీ కార్యదర్శి(Secretary of Congress AICC) చల్లా వంశీచంద్ రెడ్డి(Challa Vamsichand Reddy) బుధవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో డీకే అరుణపై కీలక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

DK Aruna: Avoid politics in the name of Ram: DK Aruna

మహబూబ్ నగర్‌లోని ఓ ప్రైవేట్ వేదికగా నియోజకవర్గ కార్యకర్తల భారీ సమావేశంలో వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయడానికి డీకే అరుణ రూ.15కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. డీకే అరుణ శ్రీరాముడిపై ప్రమాణం చేసి నిజం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

డీకే అరుణ రాముడిపై ప్రమాణం చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. ఈ మేరకు ఆయన సవాల్‌ను డీకే అరుణ స్వీకరించారు. వంశీచంద్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జిల్లాలో ఆయనను ఎవరూ గుర్తు పట్టడంలేదని, తనపై విమర్శలు చేస్తే ఆయనకు గుర్తింపు వస్తుందని ఆరాటపడుతున్నాడని సెటైర్లు విసిరారు.

సమయం, స్థలం మీరు చెప్పినా సరే.. లేదంటే నేనే టైం డేట్ ఫిక్స్ చేస్తా.. వెంట ఎవరు వచ్చినా సరే.. అంటూ డీకే అరుణ సవాల్ చేశారు. వంశీచంద్‌కు మొదటి నుంచి రాజకీయ సన్యాసం అలవాటే అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాముడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

You may also like

Leave a Comment