Telugu News » Dream11 One Crore Winner : ఎస్ఐ రూ1.5 కోట్లు గెలిచాడు.. సస్పెండ్ అయ్యాడు.. ?

Dream11 One Crore Winner : ఎస్ఐ రూ1.5 కోట్లు గెలిచాడు.. సస్పెండ్ అయ్యాడు.. ?

చట్టానికి ఎవరు చుట్టాలు కాదని నిరూపించారు మహారాష్ట్ర పోలీస్ అధికారులు. మహారాష్ట్ర (Maharashtra)లోని పింప్రి చించ్​వాడ్​ పోలీస్​ కమిషనరేట్​కు చెందిన SI సోమ్​నాథ్​ జెండే.. డ్రీమ్ ​11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్​లో.. సోమ్​నాథ్​ (Somnath) బెట్టింగ్​ కాసి ఈ డబ్బులు పొందారు.

by Venu

ఆన్​లైన్ బెట్టింగ్​ యాప్ (Online Betting App) విషయంలో ఎన్నో వివాదాలు చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. స్వయంగా పోలీసులు కూడా కొన్ని సందర్భాలలో ఆన్​లైన్ బెట్టింగ్​ పై చర్యలు తీసుకొన్నారు. ఈ యాప్ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సోషల్ మీడియాలో (Social Media) ప్రచారం కూడా చేశారు పోలీసులు (Police). ఇంతవరకు బాగానే ఉన్నా స్వయంగా పోలీస్ ఆఫీసరే ఈ ఆన్​లైన్ బెట్టింగ్​ యాప్ ఉపయోగిస్తే చర్యలు ఉండవా అనే అనుమానం వస్తుంది.

కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదని నిరూపించారు మహారాష్ట్ర పోలీస్ అధికారులు. మహారాష్ట్ర (Maharashtra)లోని పింప్రి చించ్​వాడ్​ పోలీస్​ కమిషనరేట్​కు చెందిన SI సోమ్​నాథ్​ జెండే.. డ్రీమ్ ​11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్​లో.. సోమ్​నాథ్​ (Somnath) బెట్టింగ్​ కాసి ఈ డబ్బులు పొందారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

నిబంధనలను అతిక్రమించి పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయనను విధుల్లో నుంచి సస్పెండ్​ చేస్తున్నట్టు ఏసీపీ సతీశ్​ మానే ధ్రువీకరించారు. డీసీపీకి తదుపరి శాఖపరమైన విచారణ బాధ్యతలను అప్పగించారు. అయితే కోటిన్నర గెలుచుకుని వార్తల్లో నిలిచిన సోమ్​నాథ్.. సస్పెండ్ అయ్యి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వీధి విచిత్రం అంటే ఇదే కావచ్చు..!

You may also like

Leave a Comment