Telugu News » Suicide: బావిలో దూకి..కుటుంబం ఆత్మహత్య!

Suicide: బావిలో దూకి..కుటుంబం ఆత్మహత్య!

నూతిలో పడి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.

by Sai
father-mother-and-daughter-committed-suicide-by-jumping-into-a-well

విజయనగరం(Vizayanagaram) జిల్లా శృంగవరపుకోటలో విషాదం చోటు చేసుకుంది. బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం అర్థ రాత్రి జరుగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.

father-mother-and-daughter-committed-suicide-by-jumping-into-a-well

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…విజయనగరం జిల్లా శృంగవరపుకోట కొత్తవలస మండలం,చింతలపాలెం గ్రామ పొలాల సమీపంలో నూతిలో పడి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలో తండ్రి, తల్లి, కుమార్తె మరణించారు.

ఆత్మహత్య చేసుకున్నది విశాఖపట్నం జిల్లా, మర్రిపాలెం గ్రామ FCI Nagar ప్రాంతానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతులు ఎం.డి మహినుద్దీన్ (46) భార్య సంసు (39) , కుమార్తె బహిర (17 ) సంవత్సరాలు ఉన్నారని గుర్తించారు పోలీసులు.

క్యాబ్ లో పొలాల వద్దకు వచ్చిన వారు ముగ్గురు కూడా కుమారుడు ఆలీ కి ఫోన్ చేసి మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని లొకేషన్ పెట్టి సూసైడ్ నోట్ పెట్టి చనిపోయినట్టు సమాచారం. కొత్త వలస సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment