Telugu News » Governor Tamilisai: రాజ్‌భ‌వ‌న్‌లో పాయ‌సం వండిన గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై..!

Governor Tamilisai: రాజ్‌భ‌వ‌న్‌లో పాయ‌సం వండిన గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై..!

హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పాయసం వండారు. ఈ పొంగల్ వ్య‌క్తిగ‌తంగా ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. చిర‌కాల స్వ‌ప్నం రామ మందిర నిర్మాణం పూర్తవుతుండడమే అందుకు కారణమని చెప్పారు.

by Mano
Governor Tamilisai: Governor Tamilisai cooked payasam in Raj Bhavan..!

హైద‌రాబాద్‌(Hyderabad)లోని రాజ్‌భ‌వ‌న్‌(Rajbhavan)లో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఇవాళ(శనివారం) ఉద‌యం భోగి వేడుక‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర రాజన్(Governor Tamilisai) పాయసం వండారు. ఆమె ఆ వంట‌కాన్ని క‌ట్టెల పొయ్యిపై కుండలో త‌యారు చేయడం విశేషం.

Governor Tamilisai: Governor Tamilisai cooked payasam in Raj Bhavan..!

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేశ‌, తెలుగు ప్ర‌జ‌ల‌కు భోగి, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌కు ఈ పొంగల్ వ్య‌క్తిగ‌తంగా ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. చిర‌కాల స్వ‌ప్నం రామ మందిర నిర్మాణం పూర్తవుతుండడమే అందుకు కారణమని చెప్పారు.

ఇది విక‌సిత్ భార‌త్ అని ఆమె వ్యాఖ్యానించారు. అతిత్వరలో శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాష‌లో ఓ పాట‌ను విడుదల చేయ‌నున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో ప్ర‌తీఒక్కరు సంతోషంగా ఉండాల‌ని ఆమె ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

కాగా, శుక్ర‌వారం ఆమె పుదుచ్చ‌రి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఆమె కలువనున్నారు.

You may also like

Leave a Comment