Telugu News » Jagtial : ఎగ్ కర్రీ వండలేదని భార్యని దారుణంగా..!

Jagtial : ఎగ్ కర్రీ వండలేదని భార్యని దారుణంగా..!

పండగ పూట ఎగ్ కర్రీ వండలేదని ఓ వ్యక్తి తన భార్యను చంపాడు. కర్రీది ఏముంది ఈ రోజు కాకపోతే రేపు తినవచ్చు.. కానీ ప్రాణం పోతే తీసుకురావడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు.. ఈ ఆలోచన లేని ఆ మనిషి మృగంగా మారి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. జగిత్యాలలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

by Venu

పండగ సమయంలో ఆనందంగా గడపవలసిన ఇంటిలో ఆవేశం విషాదాన్ని నింపింది. విచక్షణ కోల్పోయిన ఆ వ్యక్తి హంతకునిగా మారాడు. కోపం వస్తే మైండ్ ను అదుపులో పెట్టుకోవాలి గాని ప్రాణం తీస్తే కుటుంబం రోడ్డున పడి.. పిల్లలు అనాథలు అవుతారన్న విషయాన్ని మరచిపోతున్నారు.. కానీ నేటి కాలంలో ఆలోచన కోల్పోయి ఆవేశంలో రాక్షసులుగా మారుతున్న వారు ఎక్కువవుతున్నారు.

ఇక పండగ పూట ఎగ్ కర్రీ వండలేదని ఓ వ్యక్తి తన భార్యను చంపాడు. కర్రీది ఏముంది ఈ రోజు కాకపోతే రేపు తినవచ్చు.. కానీ ప్రాణం పోతే తీసుకురావడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు.. ఈ ఆలోచన లేని ఆ మనిషి మృగంగా మారి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. జగిత్యాలలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

జగిత్యాల (Jagtial) టీఆర్ నగర్ (TR Nagar) లో ఉంటున్న కట్ట సంజయ్ అనే వ్యక్తి దసరా పండుగ (Dussehra Festival) సందర్భంగా ఎగ్ కర్రీ (Egg curry) వండలేదని గొడవ పడి, భార్య సుమలత(33)ను గొంతు నులిమి చంపేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మరోవైపు గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై కేస్ నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ తెలిపారు.

You may also like

Leave a Comment