Telugu News » Hyderabad: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లినే చంపేశాడు..!

Hyderabad: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లినే చంపేశాడు..!

హైదరాబాద్‌(Hyderabad)లోని రామంతాపూర్‌(Ramanthapur)లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు ఓ కసాయి కొడుకు.

by Mano
Hyderabad: Atrocious.. Kanna killed his own mother for property..!

మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. డబ్బు కోసం సొంతవారినే హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌(Hyderabad)లోని రామంతాపూర్‌(Ramanthapur)లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు ఓ కసాయి కొడుకు.

Hyderabad: Atrocious.. Kanna killed his own mother for property..!

రామంతాపూర్‌లో కొడుకు అనిల్‌, కోడలు తిరుమలతో సుగుణమ్మ నివాసముంటోంది. సుగుణమ్మ పేరు మీద ఉన్న ఇంటిని కొడుకు, కోడలు అమ్మాలని అనుకున్నారు. కానీ సుగుణమ్మ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని భావించిన అనిల్‌.. భార్య, స్నేహితుడితో కలిసి పథకం పన్నాడు.

అత్యంత దారుణంగా కన్నతల్లిని హతమార్చాడు. ఆ తర్వాత తన తల్లి అనారోగ్యంతో మృతిచెందిందని నమ్మబలికాడు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేశాడు. అయితే, అదే సమయంలో అనుమానం వచ్చిన బంధువులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు సుగుణమ్మ మృతిపై విచారణ చేపట్టారు. మృతురాలి కొడుకు, కోడలు సహా మరో వ్యక్తిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆస్తి కోసం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు పోలీసులు వారిని అరెస్టు చేశారు.

You may also like

Leave a Comment