Telugu News » Hyderabad : నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్ వైపు అసలే వెళ్ళకండి..!

Hyderabad : నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్ వైపు అసలే వెళ్ళకండి..!

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం (Immersion of Goddess Durga Idols) సందర్భంగా నగరంలో 23 నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్ (Hussainsagar) ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సీపీ సుధీర్ బాబు (CP Sudhir Babu) తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ మార్గ్‌, గార్డెన్‌ పాయింట్‌, జలవిహార్‌లోని బేబీ పాండ్స్‌, సంజీవయ్య పార్కులో విగ్రహాల నిమజ్జనం జరగనుంది. కాబట్టి ఈ రూట్ లో వెళ్ళేవారు దారి మళ్ళడం బెటర్ అంటున్నారు అధికారులు..

by Venu

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) ఉన్నాయంటే చాలు జనం గుండె గుభేల్ మంటుంది. అసలే ట్రాఫిక్.. ఉద్యోగాని లేటు అయితే చీవాట్లు అనే విషయాల్లో జనం టెన్షన్ పడటం కనిపిస్తుంది. కానీ ఇలాంటి విషయాలు ముందుగా తెలుసుకొని ప్లాన్ చేసుకొంటే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం అయినా దొరుకుతుంది. అందుకోసమే ఈ వార్తా..

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం (Immersion of Goddess Durga Idols) సందర్భంగా నగరంలో 23 నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్ (Hussainsagar) ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సీపీ సుధీర్ బాబు (CP Sudhir Babu) తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ మార్గ్‌, గార్డెన్‌ పాయింట్‌, జలవిహార్‌లోని బేబీ పాండ్స్‌, సంజీవయ్య పార్కులో విగ్రహాల నిమజ్జనం జరగనుంది. కాబట్టి ఈ రూట్ లో వెళ్ళేవారు దారి మళ్ళడం బెటర్ అంటున్నారు అధికారులు.. ఇక ట్రాఫిక్‌ ఆంక్షల సందర్భంగా ఏ రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారో చూస్తే..

పంజాగుట్ట, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌ కు వచ్చే వాహనాలు వివి విగ్రహం వద్ద సదన్‌ కళాశాల, నిరంకారి వైపు వెళ్లాలని తెలుపుతున్నారు. నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను పాత సైఫాబాద్ పీఎస్ వద్ద రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. అయితే అమ్మవారి విగ్రహాలు మాత్రమే ఇక్బాల్ మినార్ వైపు వెళ్లేందుకు అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.

ఓల్డ్ సైఫాబాద్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను రవీంద్రభారతి వద్ద లక్డీకాపూల్ వైపు మళ్లించనున్నారు.. ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి జంక్షన్ మీదుగా అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు మళ్లించారు.. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు.. మినిస్టర్‌ రోడ్డు, రాణిగంజ్‌, పీవీ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను నల్లగుట్ట వంతెన వద్ద మళ్లిస్తున్నట్టు వెల్లడించారు…

బుద్ధభవన్ వైపు నుంచి నల్లగుట్ట వైపు వెళ్ళే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను మసీదు సోనాబీ అబ్దుల్లా వద్ద మినిస్టర్ రోడ్, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.. మరోవైపు వాహనాలను నాంపల్లి, కంట్రోల్ రూమ్, బీజేఆర్ సర్కిల్ వైపు అనుమతించడం లేదని తెలిపారు. బదులుగా ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద రవీంద్ర భారతి, ఎంజే మార్కెట్‌ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు..

You may also like

Leave a Comment