Telugu News » Israel: ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణి దాడి.. భారతీయుడి మృతి..!

Israel: ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణి దాడి.. భారతీయుడి మృతి..!

ఇజ్రాయెల్‌((Israel)పై క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతిచెందాడు.

by Mano
Sai Praneeth Retirement: India's star shuttler announced his retirement..!

ఇజ్రాయెల్‌((Israel)పై క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతిచెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కేరళ(Kerala)కు చెందినవారు. లెబనాన్ భూభాగం నుంచి ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Sai Praneeth Retirement: India's star shuttler announced his retirement..!

మృతుడిని కేరళలోని కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్ మాక్స్వెల్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆయన మృతదేహం స్థానిక జీవ్ ఆసుపత్రిలో ఉందని అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌కు చికిత్స అందిస్తున్నారు. పాల్‌ మెల్విన్‌కు శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపారు.

ఈ దాడి హెజొబొల్లా పనేనని అనుమానిస్తున్నారు. హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజొ బొల్లాతో ఇజ్రాయెల్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్ అక్టోబర్ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.

దీనికి ప్రతీకారంగా హెజొబొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. దీంతో ఈ గ్రూప్ పైనాఐడీఎఫ్ దాడులు చేపడుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏడుగురు పౌరులతో పాటు 10 మంది సైనికులు మరణించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల వల్ల తమవైపు 229 మంది మృతిచెందినట్లు హెజొల్లా ప్రకటించింది.

You may also like

Leave a Comment