Telugu News » Kishan Reddy: అలాంటోళ్లను చెప్పులతో కొట్టండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: అలాంటోళ్లను చెప్పులతో కొట్టండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అని ఎవరైనా అంటే.. అలాంటోళ్లను చెప్పులతో కొట్టండి..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అలాంటి ఆలోచనే తమకు లేదని వెల్లడించారు.

by Mano
Kishan Reddy: Beat them with sandals: Union Minister Kishan Reddy

తెలంగాణ ఎన్నికల(Telangana Elections) ప్రచారం ముగుస్తుండడంతో పార్టీ అధినేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అని ఎవరైనా అంటే.. అలాంటోళ్లను చెప్పులతో కొట్టండి..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy: Beat them with sandals: Union Minister Kishan Reddy

బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అసలు అలాంటి ఆలోచనే తమకు లేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పదేపదే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఒక్కటే అంటూ పదేపదే విమర్శలు చేయడం.. అందుకు తగ్గ ఆధారాలు ఇవే అంటూ అవాస్తవాలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ పేరు మార్పు ఖాయమని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎవడీ హైదర్.. ఎందుకిలా హైదరాబాద్ పేరు అని ప్రశ్నించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. బాంబేను ముంబైగా మార్చినట్లు.. మద్రాస్‌ను చెన్నైగా మార్చినట్లు కలకత్తాను కోల్‌కతాగా మార్చినట్లు హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు.

రైతు బంధు నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లకు డ్రామాలు కొత్త కాదని, రైతులు, ప్రజలను మభ్యపెడుతూ చీప్ ట్రిక్స్‌ చేస్తున్నాయని విమర్శించారు. రైతులపై ఆ పార్టీలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. బీఆర్ఎస్‌కు రైతులపై ప్రేమ ఉంటే.. రైతుబంధు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఇవ్వొచ్చు కదా..? అని నిలదీశారు.

You may also like

Leave a Comment