Telugu News » Kishan Reddy: తెలంగాణా విమోచన పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి…కిషన్ రెడ్డి

Kishan Reddy: తెలంగాణా విమోచన పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి…కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాల అమరధామం వరకు బైక్ ర్యాలీగా కిషన్‌రెడ్డి బయలుదేరారు.

by Prasanna

తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy)  బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాల అమరధామం వరకు బైక్ ర్యాలీగా కిషన్‌రెడ్డి బయలుదేరారు.

kishan reddy

బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవడేకర్ ( Prakash Javadekar) జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

విమోచన పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని, యోధులు మరణించిన ప్రదేశాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ, తార్నాకా, ఉప్పల్, భైరాన్పల్లి, ఖిలాషాపూర్, పరకాల వరకు బైక్ ర్యాలీ సాగనుంది. సాయంత్రం పరకాల బహిరంగ సభలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ సందర్భంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీజేపీ బైక్ ర్యాలీలు నిర్వహిస్తోంది.

 

You may also like

Leave a Comment