Telugu News » Kishan Reddy: దివ్యాంగుల రిజర్వేషన్‌ను 4శాతానికి పెంచిన ఘనత మోడీదే: కిషన్ రెడ్డి

Kishan Reddy: దివ్యాంగుల రిజర్వేషన్‌ను 4శాతానికి పెంచిన ఘనత మోడీదే: కిషన్ రెడ్డి

ఇవాళ సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర, రోడ్‌ షోలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

by Mano
Kishan Reddy: Credit for increasing reservation for disabled persons to 4 percent belongs to Modi: Kishan Reddy

ఇవాళ సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర, రోడ్‌ షోలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులకు 3శాతం ఉన్న రిజర్వేషన్లను 4 శాతానికి పెంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని (PM Narendra Modi) పేర్కొన్నారు.

Kishan Reddy: Credit for increasing reservation for disabled persons to 4 percent belongs to Modi: Kishan Reddy

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దివ్యాంగులకు 3వేల పింఛన్లు వచ్చేందుకు పోరాటం చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దివ్యాంగుల కోసం మరిన్ని సౌకర్యాల కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కాగా, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రభుత్వం.. మోడీ సర్కార్ అని చెప్పారు. అంగవైకల్యంతో ఉన్న వారిని దివ్యాంగులని సంబోదించాలని చెప్పడమే కాకుండా అలానే పిలవాలని ప్రధాని మోడీ జీవో తీసుకు వచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

గతంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేసి పింఛన్ సాధించుకున్నామని అన్నారు. అన్ని వేళలా నరేంద్ర మోడీ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment