Telugu News » Komati reddy : కాంగ్రెస్ దే విజయం.. మొదటి సంతకం ఆ ఫైల్ పైనే!

Komati reddy : కాంగ్రెస్ దే విజయం.. మొదటి సంతకం ఆ ఫైల్ పైనే!

కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తాం.. మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పైనే చేస్తాం.. 4 వేల రూపాయల పెన్షన్ అందిస్తాం..

by admin
komatireddy fire on kcr govt

ఉచిత కరెంట్ పై ప్రభుత్వం చెప్పేవి అబద్ధాలన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy). లాగ్ బుక్స్ తో ఈ విషయాన్ని బయటపెట్టానని తెలిపారు. భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో మాజీ ఎంపీపీ నర్సయ్య అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ.. మరోసారి సబ్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతానని తెలిపారు.

komatireddy fire on kcr govt

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు వెంకట్ రెడ్డి. మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పైనే చేస్తామని.. 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని తెలిపారు. కేసీఆర్ (KCR) పాలనలో విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారని.. 50వేల కోట్లు మద్యం అమ్మకాలపైనే వస్తున్నాయని.. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయని ప్రశ్నించారు. ఈనెల 16, 17 తర్వాత బస్సుయాత్ర మొదలుపెడతామన్న ఆయన… తెలంగాణ అంతా పర్యటిస్తామని చెప్పారు.

భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరు అని.. ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్లు, బాత్రూమ్స్ లేకపోతే 20 లక్షలు పెట్టి బాగు చేయించానని తెలిపారు. అలాగే, మైనార్టీల కోసం 20 లక్షలు పెట్టి దర్గా కట్టించానని వివరించారు. పేద విద్యార్థులు తన దగ్గరకు వస్తే పార్టీలకు అతీతంగానే సాయం చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. ఏ సర్వే చూసినా జనం కాంగ్రెస్ నే గెలిపిస్తామని చెబుతున్నారని అన్నారు.

వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు కోమటిరెడ్డి. గ్రూప్-2 పరీక్ష పోస్ట్ పోన్ చేయమని అభ్యర్థులు అడుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామని తెలిపారు. 5 లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారని… తమ ప్రభుత్వం వచ్చిన 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment