Telugu News » West Godavari: మనవడిని మట్టుబెట్టిన తాత…కారణం..!?

West Godavari: మనవడిని మట్టుబెట్టిన తాత…కారణం..!?

పిల్లలు దేవుడితో సమానం అంటారు..మరి పెద్దవాళ్లు ఎవరో..!? ఏ కోవకి వస్తున్నారో..ఎలా మారుతున్నారో అర్థం చేసుకోవాల్సిన సంఘటన ఇది.

by sai krishna

పిల్లలు దేవుడితో సమానం అంటారు..మరి పెద్దవాళ్లు ఎవరో..!? ఏ కోవకి వస్తున్నారో..ఎలా మారుతున్నారో అర్థం చేసుకోవాల్సిన సంఘటన ఇది.ఆ రోజు ఉదయం …తాతెందుకంత ముద్దు చేస్తున్నాడో ఆ మనవడికి తెలియదు.

అభం శుభం తెలియని ఆ పసివాడు తాత వెంటవెళ్లాడు..ఏవైనా కొనిపెడతాడేమో..! ఏదైనా కొత్త ప్రదేశాన్ని తనకు చూపించడానికి తీసువెళ్తున్నాడేమో!అని చాలా సంబరపడిపోతూ వెళ్లాడా మనవడు.

కానీ మళ్లీ ఇంటికి రాలేదు. ఎందుకంటే తాత రానివ్వలేదు. నిర్థాక్షణ్యంగా చంపి కాలువలోకి విసిరేశాడు.ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా(west godavari), పెంటపాడు మండలం(Pentapadu Mandal) మీనవల్లురు(Meenavalluru village)లో జరిగింది.

కొడుకు, కోడలు మధ్య విబేధాలు కారణంగా విడాకులు తీసుకుంటే ఆస్తి మనవడికి వెళ్తుందని భావించిన తాతయ్య..సొంత మనవడిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 9వ తేదీన ఉదయం బాలుడిని వెంటబెట్టుకుని వెళ్లి హత్య చేసి యణమధుర్రు కాలువలో పడేశాడు. ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చిన నిందితుడు పోకల నాగేశ్వరరావు..మళ్లీ బాబు కనిపించట్లేదంటే అందరితో కలిసి వెతికాడు.

అయితే ఇంత చేసిన తాతకు ఏదైనా ఇచ్చిపోవాలనుకున్నమనవడు అదే కాలువలో శవంగా లభ్యం అయ్యాడు. కాగా పోలీసులు విచారణ (investigation ) చేపట్టారు.

బాలుడిని 9వ తేదీ ఉదయం తాత నాగేశ్వర రావు ఆ కాలువ వద్దకు తీసుకు వెళ్లడాన్ని చూసిన స్థానికులు..అతనిపై అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

You may also like

Leave a Comment