Telugu News » Bumper Offer : ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్.. అలాంటి వారికి మాత్రమే..!

Bumper Offer : ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్.. అలాంటి వారికి మాత్రమే..!

ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించాలని కీలక సూచనలు చేసింది.. టికెట్ బుకింగ్‌ చేసుకోవడం కోసం మొబైల్ యాప్, కంపెనీ వెబ్‌సైట్ ఉపయోగించుకోవాలని తెలిపింది.

by Venu
Lok Sabha Elections First Phase Notification Release.. Acceptance of Nominations Begin

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆఫర్స్ ప్రకటించడం తెలిసిందే.. అయితే ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) కూడా ఒక బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించింది. తన విమాన చార్జీలపై 19 శాతం తగ్గింపును ప్రకటించింది. కానీ అందరికీ మాత్రం కాదండీ.. కేవలం ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం మాత్రమే అని తెలిపింది.

Air India Express flight దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని తెలిపిన ఈ సంస్థ.. ఓటర్లను ప్రోత్సహించడానికి తమ వంతుగా ముందుకు వచ్చామని పేర్కొంది. ఇక ఈ రాయితీ పొందాలనుకునే వారు ఖచ్చితంగా 18 నుంచి 22 ఏళ్ల వయస్సు వారై ఉండాలని తెలిపింది. అలాగే ఓటు వేయబోయే నియోజకవర్గానికి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకోవాలని సూచించింది.

మరోవైపు ఈ ఆఫర్ ఉపయోగించుకొనే ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు పత్రాలను చూపించాలని.. అలాగే టికెట్ బుక్ చేసుకొన్న వారు ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించాలని కీలక సూచనలు చేసింది.. టికెట్ బుకింగ్‌ చేసుకోవడం కోసం మొబైల్ యాప్, కంపెనీ వెబ్‌సైట్ ఉపయోగించుకోవాలని తెలిపింది. కాగా మొదటిసారి ఓటు వేస్తున్న వారికి ఎక్స్‌ప్రెస్ లైట్, ఎక్స్‌ప్రెస్ వాల్యూ, ఎక్స్‌ప్రెస్ ఫ్లెక్స్, ఎక్స్‌ప్రెస్ బిజ్ అనే నాలుగు కేటగిరీలు అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్ వివరించింది.

ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ మాట్లాడుతూ, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎల్లప్పుడూ మార్పులకు అనుగుణంగా పనిచేస్తుంది, సరిహద్దులు దాటి ప్రజలను, ప్రదేశాలను, సంస్కృతులను ఏకం చేస్తుందని తెలిపారు.. అలాగే తప్పకుండా అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు..

You may also like

Leave a Comment