Telugu News » Mahbubnagar : మహబూబ్‌నగర్‌ లో పేలిన తుపాకి.. బుల్లెట్ల వర్షం కురిపించిన గుర్తు తెలియని వ్యక్తులు..!

Mahbubnagar : మహబూబ్‌నగర్‌ లో పేలిన తుపాకి.. బుల్లెట్ల వర్షం కురిపించిన గుర్తు తెలియని వ్యక్తులు..!

ఈ నేపథ్యంలో వీటిని కాల్చింది ఎవరు? శూనకాలపై ఎందుకు తుపాకులను ప్రయోగించారు అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. మరోవైపు గ్రామంలో వీధి కుక్కలు రక్తపు మడుగులో పడి ఉండడం తెల్లవారుజామున చూసిన గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు.

by Venu

మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) జిల్లాలో ఊహించని ఓ సంఘటన కలకలం సృష్టిస్తోంది. మూసాపేట్ మండలం పొన్నకల్ (Ponnakal) గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నేటి తెల్లవారుజామున గ్రామంలో ఉన్న 20 వీధి కుక్కలపై కాల్పులు జరిపినట్లు సమాచారం. తుపాకుల శబ్ధం వినిపించకుండా సైలెన్సర్ బిగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇంత కాలం మనుషులపై తుపాకులతో విరుచుకుపడుతుండగా తాజాగా వీధి కుక్కలను (Stray Dogs) సైతం తుపాకులతో కాల్చి చంపడం (Shot With Guns) స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో ఉన్న కుక్కలన్నింటినీ చంపడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కుక్కల కోసం తుపాకులు వినియోగించడం ఏంటని పోలీసులు సైతం విస్తుపోతున్నారు.

ఈ నేపథ్యంలో వీటిని కాల్చింది ఎవరు? శూనకాలపై ఎందుకు తుపాకులను ప్రయోగించారు అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. మరోవైపు గ్రామంలో వీధి కుక్కలు రక్తపు మడుగులో పడి ఉండడం తెల్లవారుజామున చూసిన గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సమాచారం అందుకొన్న వారు ఘటన స్థలానికి చేరుకొని.. విచారణ చేయగా.. బుల్లెట్లు తగిలి మరణించినట్లు తెలిసింది.

ఈమేరకు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కుక్కలను చంపింది ఎవరు? ఎందుకు చంపారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇది కావాలని చేశారా.. వారి చేతిలోకి గన్ ఎలా వచ్చిందనే కోణంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment