Telugu News » Uttar Pradesh : లీడర్ పై షూ దాడి.. రెచ్చిపోయిన అభిమానులు

Uttar Pradesh : లీడర్ పై షూ దాడి.. రెచ్చిపోయిన అభిమానులు

లాయర్ దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు మౌర్యపై షూ విసిరాడు. వెంటనే ఆయన మద్దతుదారులు అతనిపై విరుచుకుపడ్డారు.

by admin
Man hurls shoe at SP leader Swami Prasad Maurya

తమకు ఇష్టం లేని లీడర్లపై ఎటాక్ చేయడం నార్త్ లో కామన్. కొందరు ఇంక్ పోసి నిరసన తెలుపుతుంటారు. మరికొందరు షూ, చెప్పులతో దాడి చేస్తారు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) కు ఇదే అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆయనపై షూ విసిరాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు అతడ్ని చావబాదారు.

Man hurls shoe at SP leader Swami Prasad Maurya

లక్నో (Lucknow) లోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌ దగ్గర సోమవారం జరిగిన ఓబీసీ సమ్మేళన్‌ కు హాజరయ్యారు మౌర్య. అక్కడకు వచ్చినవారిని పలకరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో లాయర్ దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు మౌర్యపై షూ విసిరాడు. వెంటనే ఆయన మద్దతుదారులు అతనిపై విరుచుకుపడ్డారు. మూకుమ్మడిగా దాడి చేశారు. స్వామి ప్రసాద్ మౌర్య జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూనే అతడ్ని చావగొట్టారు.

మౌర్య అభిమానుల దాడితో షూ విసిరిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీసులు పక్కనే ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. దాడిని నిలువరించేందుకు ప్రయత్నించినప్పటికీ మౌర్య మద్దతుదారులు తగ్గలేదు. అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. బెల్టులతోనూ కొట్టారు. తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు అక్కడకు వచ్చి దాడి చేస్తున్న వారిని పక్కకు తోసేశారు.

You may also like

Leave a Comment