Telugu News » Medak : మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సును ఢీకొట్టిన లారీ..!

Medak : మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సును ఢీకొట్టిన లారీ..!

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని.. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ (Hyderabad) ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. సిద్దిపేట నుంచి మెదక్ కు వస్తున్న పెండ్లి బృందం బస్సును మెదక్ నుంచి సిద్దిపేట వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

by Venu
Road Accident: A van collided with a stationary lorry.. Three died..!

మెదక్ (Medak) జిల్లా నిజాంపేట (Nizampet) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకొంది. నిజాంపేట మండల శివారులో నేటి ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. పెండ్లి బృందంతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని.. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ (Hyderabad) ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. సిద్దిపేట నుంచి మెదక్ కు వస్తున్న పెండ్లి బృందం బస్సును మెదక్ నుంచి సిద్దిపేట వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్ళడంతో క్షతగాత్రులను ఫోన్ లో పరామర్శించారు.

వెంటనే సిద్దిపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ తో సైతం ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. అవసరమైతే హైద్రాబాద్ లోని ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు..

You may also like

Leave a Comment