Telugu News » Minister Botsa: పవన్‌కల్యాణ్‌పై ఏపీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..!

Minister Botsa: పవన్‌కల్యాణ్‌పై ఏపీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఆంధప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని, కావాలంటే తాను ట్యూషన్ చెబుతానని మంత్రి హితవుపలికారు.

by Mano
Minister Botsa: AP Minister Botsa's key comments on Pawan Kalyan..!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఆంధప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని, కావాలంటే తాను ట్యూషన్ చెబుతానని మంత్రి హితవుపలికారు. కాంగ్రెస్ హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నానని, అప్పుడు మామీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించుకున్నామని చెప్పారు.

Minister Botsa: AP Minister Botsa's key comments on Pawan Kalyan..!

ఇప్పుడు పవన్ కళ్యాణ్, వారి పార్టనర్ మీద సీబీఐ విచారణ అడగాలన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన అధికారంలోకి రాదని.. మరి ఏ రాష్ట్రంలో వస్తుందో తనకు తెలియదని అన్నారు. ఏపీలో మద్యపాన నిషేధం దశల వారిగా అమలు చేస్తామని చెప్పామని మంత్రి బొత్స అన్నారు. డబ్బు మదంతో ఉన్న వాళ్ళు దాని జోలికి వెళ్తారని, మద్యం రేట్లు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని అయితే ఇప్పుడు సీపీఎస్ రద్దు చేయలేమన్నారు. ఉద్యోగులకు దైర్యం చెప్పామని బొత్స అన్నారు. వేయలేనిది చేయలేమని చెప్పామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వైఖరిపై అధిష్టానంతో చర్చించి చెబుతామని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు.

విశాఖ సీఎం కార్యాలయం, పరిపాలన రావడం అంశంపై తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారన్నారు. సామాజిక న్యాయ బస్ యాత్రకు అన్ని అనుమతులు తీసుకున్నామని మంత్రి బొత్స తెలిపారు. ఎంసెట్ మూడో విడత కౌన్సిలింగ్ ఉండదని ముందే చెప్పామని, గత సంవత్సరం కేవలం తక్కువ మంది మూడో కౌన్సిలింగ్‌కు వచ్చారని అన్నారు.

You may also like

Leave a Comment