Telugu News » Minister Govarthan Reddy: ‘నరహంతకుడని తిట్టి.. ఇప్పుడు ప్రదక్షిణలా..?’

Minister Govarthan Reddy: ‘నరహంతకుడని తిట్టి.. ఇప్పుడు ప్రదక్షిణలా..?’

మెదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధం సిభ రికార్డు సృష్టించిందని గోవర్దన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

by Mano
Minister Govarthan Reddy: 'Cursed for being a murderer.. Now for Pradakshina..?'

ప్రధాని మోడీ(PM Modi)ని నరహంతకుడని తిట్టిన వారే ఇప్పుడు స్వప్రయోజనం కోసం ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి(Minister Govarthan Reddy) ఆరోపించారు. మెదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధం సిభ రికార్డు సృష్టించిందని గోవర్దన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Minister Govarthan Reddy: 'Cursed for being a murderer.. Now for Pradakshina..?'

తన కుటుంబం 60ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని తన జీవితంలో ఏనాడూ ఇంతటి స్పందన చూడలేదని తెలిపారు. సభకు వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబుకు గ్యాస్టిక్ ట్రబుల్ వచ్చిందంటూ చురకలు అంటించారు. గ్రాఫిక్స్ ద్వారా అధికంగా ప్రజలు వచ్చినట్లు చూపించారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోందని, గ్రాఫిక్స్‌కు ఆద్యుడు చంద్రబాబేనని దుయ్యబట్టారు.

‘రా కదలిరా’ సభల్లో ప్రజలను చూపించరని, ఎందుకంటే అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిస్తాయంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రజల చుట్టూ తిరుగుతుంటే పొత్తుల కోసం ఢిల్లీలో చంద్రబాబు తిరుగుతున్నారని మంత్రి ఆరోపించారు. జనం లేని దానికి సేనాని పవన్‌తో కలిశారు.. ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నారు అంటూ మండిపడ్డారు. మోడీని రకరకాలుగా తిట్టి.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శించి.. ఇప్పుడు ఆయనతోనే కలుస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

‘2014 ముగ్గురూ ఒకటయ్యారు. 2019లో విడిపోయారు.. జగన్ ను ఓడించాలానే లక్ష్యంతోనే మళ్లీ ముగ్గురూ కలుస్తున్నారు.. ప్రతీ సర్వేలోనూ వైసీపీకి మెజార్టీ వస్తుందని వెల్లడవుతోంది. గతంతో పోల్చుకుంటే వైసీపీ బలం ఇంకా పెరిగింది.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సునామి సృష్టించి విజయ దుందుభిని మోగించనుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment