మొన్న కాంగ్రెస్ (Congress)కు ఓటు వేసిన వారు పశ్చత్తాపపడుతున్నారని బీఆర్ఎస్ (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గుంపు మేస్త్రీకి పరిపాలన అనుభవం లేదని చెప్పారు. గుంపు మేస్త్రీ దావస్లో అన్నీ అబద్ధాలు చెప్పాడని విమర్శలు గుప్పించారు. ఇదేం గుంపు మేస్త్రి పాలన అంటూ రైతులు బాధపడుతున్నారని తెలిపారు.
కరీంనగర్లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… అనుభవం ఉన్న కేసీఆర్ పైసా పైసా కూడబెట్టి 7500 కోట్లు జమ చేసి 70 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో రైతుబంధు వేశారని వెల్లడించారు. గుంపు మేస్త్రి డిసెంబర్ 3న సీఎం అయ్యారని గుర్తు చేశారు. ఈ రోజు వరకు రైతుబంధు వేయాలా.. వద్దా? అని తెలుస్తలేదన్నారు. కానీ, విదేశాల్లోకి పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెబుతున్నడని మండిపడ్డారు.
భరోసా వేస్తున్నామని దావోస్లో చెప్పిండని ఫైర్ అయ్యారు. ఊళ్లలో రైతులు బాధపడుతున్నారని చెప్పారు. ఇదేంరా నాయన.. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతుబంధు వస్తుండేదని.. ఇదేం గుంపు మేస్త్రిపాలన రా నాయన…. ఇప్పటి వరకు రైతుబంధుకు దిక్కులేదని బాధపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం పదవి చేసేందుకు అనుభవం ఉందా? అంటే రేవంత్రెడ్డి ఏమన్నాడని గుర్తు చేశారు.
గా పదవి గుంపు మేస్త్రి లెక్క.. ఒకడు సున్నం కొడుతడు. ఒకడు సిమెంట్ వేస్తడు. నేనే గిట్లగిట్ల అంటే అయిపోతదన్నడని ఎద్దేవా చేశారు. రైతు భరోసా మొదలైందా? అని ప్రశ్నించారు. రైతు భరోసా అంటే రూ.15వేలు అకౌంట్లలో వేయాలి కదా? అన్నారు. రైతుబంధును రైతు భరోసా అని పేరు మార్చి.. డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నడు గుంపుమేస్త్రి అంటూ ధ్వజమెత్తారు. ‘మీరు సోషల్ మీడియాలో గట్టిగా ఉంటే.. రోజుకు పదిసార్లు వాళ్లు దొరుకుతరు’అని సోషల్ మీడియా వారియర్లకు సూచనలు చేశారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిన్న ఏం మాట మాట్లాడిండన్నారు. రైతు బంధు పడలేదంటే చెప్పుదీసి కొడుతానంటున్నాడని ఫైర్ అయ్యారు. ఇది మన గౌరవ మంత్రి కోమట్రెడ్డి మాట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న కూడా రైతుబంధు పడలేంటే చెప్పు దీసి కొడుతం అంటున్నరు. రాష్ట్రంలో ఉన్న 70లక్షల మంది రైతుల్లో ఎవరికైతే రైతు బంధు పడలేదో వారిని ఆలోచించాలని ఆడుగుతున్నానన్నారు. రైతుబంధు వేయనోళ్లను ఏ చెప్పుతో కొట్టాలో ఆలోచించాలని అడుగుతున్నానన్నారు.
రూ.2లక్షల రుణమాఫీ చేయనందుకు, రైతుబంధు భరోసా చాల్ చేయనందుకు.. రైతుబంధు వేయనందుకు రైతు బంధు వేయాలంటే చెప్పు తోటి కొట్టాలన్నందుకు రేపు కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు ఓటుతో కొడుతారని చెప్పారు. రైతులు ఇప్పటికే మంట మీదున్నారని అన్నారు. క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చిండా? ఏప్రిల్లో ఇస్తడా? ఇవ్వకపోతే రైతులు ఊరుకుంటరా..? అని ప్రశ్నించారు. చీరి చింతకు కట్టరు… క్వింటాల్కు రూ.500 బోనస్ మరిచిపోవద్దన్నారు. ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ల తరఫున తామే గర్జిస్తామన్నారు..
రూ.2లక్షల రుణమాఫీ అన్నారని… సోనియమ్మ పుట్టిన రోజు రూ.2లక్షల రుణమాఫీ అన్నారనని. పోయి రుణం తెచ్చుకొండి తాను సంతకం పెడుతానని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. డిసెంబర్ 9 పోయింది. జనవరి 9 పోయింది. ఫిబ్రవరి 9 వస్తోందన్నారు. మరి చేస్తడా? చేయ చేతకాదు. ఎందుకంటే గుంపుమేస్త్రికి పని చేసిన తెలివి లేదంటూ సెటైర్లు వేశారు. ఎదో ప్రతిపక్షం డైలాగులు కొట్టుకుంటూ అవతలపడ్డడు. కేసీఆర్పై బూతుపురాణం ప్రయోగించుకుంటూ తిరుగాడు వదరుబోతోడు. ఆయనకు ఏం తెల్వది. తెల్వక ఏదో మాట్లాండిండు. ఫసాయించిండన్నారు.