Telugu News » Mumbai : విమానంలో రక్తం కక్కుకున్న ప్రయాణికుడు.. నాగపూర్ లో మృతి

Mumbai : విమానంలో రక్తం కక్కుకున్న ప్రయాణికుడు.. నాగపూర్ లో మృతి

by umakanth rao
Indigo flight

Mumbai : ముంబై-రాంచీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి విమానంలోనే రక్తం కక్కుకోవడంతో అత్యవసరంగా విమానాన్ని నాగపూర్ లో ని అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనిన్న రాత్రి దింపారు. 62 ఏళ్ళ డి. తివారీ అనే ఈ వ్యక్తి క్షయ వ్యాధితో బాధపడుతున్నాడని, అతడిని మెడికల్ ఎమర్జెన్సీ కింద నాగపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని విమాన సిబ్బంది ఒకరు తెలిపారు.

Mumbai-Ranchi IndiGo flight passenger vomits blood, dies in Nagpur after landing | Latest News India - Hindustan Times

అయితే ఇతడిని ఆసుపత్రికి చేర్చేలోగా మరణించినట్టు నాగపూర్ లోని కిమ్స్ ఆసుపత్రి డాక్టర్ ఐజాజ్ షమీ చెప్పారు. తివారీ మృతికి ముంబై-రాంచీ విమాన సిబ్బంది సంతాపం తెలిపారు. అతడిని రక్షించడానికి ప్రాథమికంగా తాము చేసిన యత్నాలు విఫలమయ్యాయన్నారు.

ఇండిగో పైలట్ ఒకరు ఇదే విమానాశ్రయంలో విమానాన్ని నడిపేందుకు వెళ్ళబోతూ ఎయిర్ పోర్ట్ గేట్ వద్ద కుప్ప కూలిపోయిన ఘటన మరువకముందే ఈ ఘటన జరిగింది.

ఆ పైలట్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మనోజ్ సుబ్రమన్యం అనే ఈ పైలట్ నాగపూర్-పూణే విమానాన్ని నడపవలసి ఉంది. అయితే 40 ఏళ్ళ ఆయన గుండెపోటుతో మరణించడం విమాన సిబ్బందిని కలచివేసింది. ఢిల్లీ-దోహా విమానంలో ప్రయాణిస్తున్న ఖతార్ ఎయిర్ వేస్ పైలట్ ఒకరు కూడా గుండెపోటుతో మృతి చెందిన ఉదంతాన్ని విమాన సిబ్బంది గుర్తు చేశారు.

You may also like

Leave a Comment