Telugu News » Mumbai : ప్రముఖ బాలీవుడ్ నటికి షాకిచ్చిన అధికారులు.. రూ.97 కోట్ల ఆస్తులు జప్తుచేసిన ఈడీ..!

Mumbai : ప్రముఖ బాలీవుడ్ నటికి షాకిచ్చిన అధికారులు.. రూ.97 కోట్ల ఆస్తులు జప్తుచేసిన ఈడీ..!

వీటి ఆధారంగా ఈడీ చర్యలకు దిగింది. మరోవైపు ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేసినందుకు గాను స్కామ్‌కు సూత్రధారి, ప్రమోటర్ అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్స్ పొందినట్లు తెలిపింది.

by Venu

ప్రముఖ బాలీవుడ్ నటి (BollyWood Actress) శిల్పాశెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra)కు ఈడీ షాకిచ్చింది. 2017లో ప్రజల నుంచి బిట్‌కాయిన్‌ల రూపంలో నెలకు 10 శాతం రాబడి ఇస్తామని నమ్మించి రూ.6600 కోట్లను వసూలు చేసి మోసం చేసిన కేసులో.. ఆయనకి చెందిన రూ. 97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసింది. నేడు వీటిని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసింది.

ఇందులో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్, పూణేలో ఉన్న రెసిడెన్షియల్ బంగ్లా శిల్పాశెట్టి పేరు మీద రిజిస్టర్ చేసినవీ ఉండగా, రాజ్ కుంద్రా పేరిట ఉన్న ఈక్విటీ షేర్లను అధికారులు జప్తు చేశారు. అలాగే గతంలో మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు వేరియబుల్ టెక్ Pte Ltd వ్యవస్థాపకుడు దివగంత అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, సింపీ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్‌లతో సహ ఎంఎల్ఎం ఏజెంట్లపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే..

వీటి ఆధారంగా ఈడీ చర్యలకు దిగింది. మరోవైపు ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేసినందుకు గాను స్కామ్‌కు సూత్రధారి, ప్రమోటర్ అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్స్ పొందినట్లు ఈడీ తన దర్యాప్తులో తెలిపింది. ప్రస్తుతం వీటి విలువ రూ.150 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అనే ముగ్గురు వ్యక్తులను ఇదివరకి అరెస్టు చేశారు.

కానీ ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ఇంకా పరారీలో ఉన్నారని వెల్లడించిన ఈడీ (ED).. ప్రమోటర్లు పెట్టు బడిదారులను మోసం చేసి, ఆన్‌లైన్ వాలెట్లలో అక్రమంగా సంపాదించిన బిట్‌కాయిన్‌లను వీరంతా దాచిపెడుతున్నారని ఆరోపించింది.

You may also like

Leave a Comment