Telugu News » Odisha : బీజేపీ దెబ్బకు బీజేడీ విలవిల.. మరో కీలక నేత ఔట్..!

Odisha : బీజేపీ దెబ్బకు బీజేడీ విలవిల.. మరో కీలక నేత ఔట్..!

అసలే ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక నేత పార్టీ వీడడం బీజేడీకి నష్టం కలిగించే అంశంగా చర్చించుకొంటున్నారు. మరోవైపు ఐదోసారి అధికారం కోసం ఎన్నికల రంగంలోకి దిగుతున్న నవీన్ సర్కార్‌కు ఊహించని దెబ్బగానే పేర్కొంటున్నారు.

by Venu

సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. వివిధ పార్టీలన్నీ కొత్త నేతల చేరికలతో బిజీగా మారాయి.. ప్రస్తుతం ఎవరికి నచ్చిన పార్టీలోకి వారు వెళ్ళడం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒడిశా (Odisha)లో అధికార బీజేడీ (BJD) ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ (Bhartrihari Mahatab) పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపించారు.

అసలే ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక నేత పార్టీ వీడడం బీజేడీకి నష్టం కలిగించే అంశంగా చర్చించుకొంటున్నారు. మరోవైపు ఐదోసారి అధికారం కోసం ఎన్నికల రంగంలోకి దిగుతున్న నవీన్ సర్కార్‌కు ఊహించని దెబ్బగానే పేర్కొంటున్నారు. ఇటీవల ఒడిశా నటుడు అరిందమ్ రాయ్ బీజేడీకి గుడ్‌బై చెప్పి బీజేపీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే.. కాగా బీజేడీలో అరిందమ్ ఇంత కాలం ముఖ్య నేతగా ఉన్నారు.

తాజాగా పార్టీని వీడిన కటక్ ఎంపీ.. బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.. ఇదిలా ఉండగా బీజేడీతో ఒడిశాలో బీజేపీ పొత్తు కుదరలేదు. ఈ క్రమంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తేల్చి చెప్పారు. 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని ప్రకటించారు.

బీజేపీని మోడీ సంక్షేమ పథకాలే గెలిపించబోతున్నాయని వెల్లడించారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా.. నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని మన్మోహన్ సమాల్ ఆరోపిం

You may also like

Leave a Comment