Telugu News » PM MODI : హైదరాబాద్ ఎంపీ మాధవీలతపై ప్రధాని మోడీ ప్రశంసలు.. ట్వీట్ వైరల్!

PM MODI : హైదరాబాద్ ఎంపీ మాధవీలతపై ప్రధాని మోడీ ప్రశంసలు.. ట్వీట్ వైరల్!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ(BJP) అగ్రనేతలు ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలు సర్వే సంస్థలు వెల్లడించిన ప్రీపోల్ ఫలితాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

by Sai

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ(BJP) అగ్రనేతలు ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలు సర్వే సంస్థలు వెల్లడించిన ప్రీపోల్ ఫలితాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

PM Modi praises Hyderabad MP Madhavila.. Tweet goes viral!

కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ నేతలు, ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే జోరుతో ఈసారి 400 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా ఎన్డీయే కూటమి, బీజేపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి దిగారు. పక్కా ప్రణాళికలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని కీలకవ్యాఖ్యలు చేశారు.

మాధవీ లత ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యింది. తాజాగా ఈ ఎపిసోడ్‌ను ప్రధాని మోడీ(PM MODI) వీక్షించారు. అంతటితో ఆగకుండా ఆ ఎపిసోడ్‌లో మాధవీలత(MP Candidate Madavi Latha) చెప్పిన సమాధానాలు తనను ప్రభావితం చేశాయని ఆమె ప్రశంసిస్తూ ప్రధాని సోషల్ మీడియా వేదిక ఎక్స్(X) వేదికగా స్పందించారు.

ప్రధాని తన ట్వీట్‌లో ‘మాధవీ లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీరు చాలా దృఢమైన పాయింట్లు ప్రస్తావించారు. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ యొక్క పునరావృత ప్రసారాన్ని వీక్షించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మీ అందరికీ ఇది చాలా సమాచారంగా ఉంటుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

You may also like

Leave a Comment