Telugu News » PM Modi: రష్యాకు అండగా ఉంటాం.. మాస్కో ఉగ్రదాడిపై ప్రధాని మోడీ ట్వీట్..!

PM Modi: రష్యాకు అండగా ఉంటాం.. మాస్కో ఉగ్రదాడిపై ప్రధాని మోడీ ట్వీట్..!

రష్యాకు భారత్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మాస్కోలోని (Mascow) క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి (Crocus City Hall) ప్రవేశించిన ఐదుగురు దుండగులు (Terror Attack) కాల్పులకు తెగబడ్డారు.

by Mano
PM Modi: We will stand by Russia.. Prime Minister Modi's tweet on Moscow terror attack..!

రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ హాల్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోడీ(PM Modi) ఎక్స్(x) వేదికగా ఖండించారు. రష్యాకు భారత్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మాస్కోలోని (Mascow) క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి (Crocus City Hall) ప్రవేశించిన ఐదుగురు దుండగులు (Terror Attack) కాల్పులకు తెగబడ్డారు.

PM Modi: We will stand by Russia.. Prime Minister Modi's tweet on Moscow terror attack..!

దీంతో 60 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ఫిక్‌నిక్‌ మ్యూజిక్ ప్రోగ్రాంలో ఈ దాడి చోటుచేసుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ (FSB) అధికారులు తెలిపారు. ఈ కాల్పులను జరిపింది తామేనని ఐఎస్‌ఐఎస్‌ (ISIS) ప్రకటించింది.

భవనంలో నుంచి బయటకు వస్తున్న వారిపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడితో కన్సర్ట్‌ హాల్‌లో మంటలు చెలరేగాయి. ఆ బిల్డింగ్‌ మొత్తం వ్యాపించడంతో భారీఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ దాడిలో ఐదురుగు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా వారిలో ఒకరు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ తన ట్వీట్‌లో ‘మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాల గురించే మా ఆలోచనలు, ప్రార్థనలు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోంది’ అని రాసుకొచ్చారు.

You may also like

Leave a Comment