Telugu News » Telangana : ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిగా ఉంటాను..!

Telangana : ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిగా ఉంటాను..!

ఈ విజయోత్సవాల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రాం పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.

by Ramu
professor kodandaram expects a democratic rule in telangana

తెలంగాణ (Telangana) లో నూతన ప్రభుత్వం (New Governament) ఏర్పాటవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) శ్రేణులు, రేవంత్ అభిమానులు సంబురాలు జరుపుకుంటున్నారు. తాజాగా సెక్రటేరియట్ వద్ద విజయోత్సవాలను నిర్వహించారు.

professor kodandaram expects a democratic rule in telangana

ఈ విజయోత్సవాల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రాం పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ఉద్యోగులకు తాను వారధిగా ఉంటానని తెలిపారు.

కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని వెల్లడించారు.గతంలో ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

ఇక నుంచి వాట్సాప్ కాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండబోదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు సంతోషం ఉండేదన్నారు. ఈ రోజు ఆ సంతోషం కనిపించిందన్నారు. రాక్షస పాలన పోయిందని తీవ్ర స్థాయిలో విరకుచుకు పడ్డారు.

You may also like

Leave a Comment