Telugu News » నాలుగో సారీ క్వార్టర్స్ తో సరి..! ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సింధు అవుట్..!!

నాలుగో సారీ క్వార్టర్స్ తో సరి..! ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సింధు అవుట్..!!

by sai krishna

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో భారత బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు ఇంటిదారి పట్టింది. క్వార్టర్స్ లో అమెరికన్ ప్లేయర్ బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17 స్కోరుతో ఓటమి పాలైంది.

ఈ సీజ‌న్‌లో నాలుగోసారైనా సెమీస్‌ మెట్టు ఎక్కుదామనుకున్న సింధు..క్వార్ట్స్ లో అది కూడా కేవ‌లం 39 నిమిషాల్లోనే జాంగ్ చేతిలో ఖంగు తింది. గ‌తంలో జాంగ్‌తో జ‌రిగిన 10 మ్యాచుల్లో ఆరు సార్లు సింధూనే.

కానీ శుక్ర‌వారం నాటి మ్యాచ్‌లో 33 ఏళ్ల చైనా అమెరిక‌న్ ప్లేయ‌ర్ చేతిలో సింధు చిత్తైంది. కాగా ప్ర‌స్తుతం సింధు17వ ర్యాంక్‌లో ఉంది. జాంగ్ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 12 ర్యాంక్‌లో ఉన్నారు.

అయితే రౌండ్ 32లో అస్మితా చాలిహ‌పై 21-18, 21-13 స్కోరుతో సింధు గెలిచింది. అంత‌కుముందు రౌండ్ 16లో ఆక‌ర్షి క‌శ్య‌ప్‌ను 21-14, 21-10 స్కోరుతో ఆమె ఓడించింది. ఆగ‌స్టు 21 నుంచి డెన్మార్క్‌లోని కోపెన్‌హెగ‌న్‌లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ నిర్వ‌హించ‌నున్నారు.

అయితే ఆ మెగా టోర్నీకి ముందు సింధు ఇలా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 2019లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ అయిన సింధు..ఇటీవ‌ల గాయాల నుంచి కోలుకున్న‌ది.

అయితే ఈ ఏడాది జ‌రిగిన 12 బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ టూర్ టోర్నీల్లో ఏడింటిలో ఆమె త్వ‌ర‌గానే నిష్క్ర‌మించింది. 2003లో ఆల్ ఇంగ్లండ్ చాంపియ‌న్ అయిన మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్ హ‌సీమ్ వ‌ద్ద ప్ర‌స్తుతం సింధు శిక్ష‌ణ తీసుకుంటోంది.

You may also like

Leave a Comment