Telugu News » Rangareddy : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలను హతమార్చిన తండ్రి..!

Rangareddy : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలను హతమార్చిన తండ్రి..!

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకొన్న మోకిలా పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

by Venu
Murder in Ap: A YCP worker was brutally murdered by throwing pepper in his eyes..!

రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంకర్ పల్లి (Shankar Pally) మండలం టంగుటూరు (Tanguturu)లో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. కన్న తండ్రి యముడిలా మారి తన పిల్లల ప్రాణాలు తీసిన సంఘటన నాన్న అనే పదానికి మచ్చగా మారింది. కారణం ఏదైనా కన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా కాటికి పంపి తానుకూడా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే..

student found hanging in school hostel premises in suryapet

స్థానికంగా నివాసం ఉంటున్న రవి(35) తన ముగ్గురు పిల్లలను చంపి.. అనంతరం తాను కూడా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి రవి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకొన్న మోకిలా పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా వెయ్యికి రూ.3వేల ఇప్పిస్తానని రవి పలువురి వద్ద డబ్బు సేకరించినట్లు సమాచారం. డబ్బు తీసుకొన్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో రవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు తూప్రాన్ (Thupran) మండలం ఇస్లాంపూర్ (Islampur) గ్రామంలో ఘోరం చోటు చేసుకొంది.

గ్రామానికి చెందిన గొల్ల వంశీ (25) పై తండ్రి కిష్టయ్య మరొకరితో కలిసి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆరు నెలల క్రితమే కిష్టయ్య భార్య ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు తాగుడుకు బానిసయ్యాడు. కోడలు సైతం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విసుగు చెందిన కిష్టయ్య.. తన వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్‌తో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం..

You may also like

Leave a Comment