Telugu News » Road Accdent: సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి

Road Accdent: సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి

ఆ రోడ్డుపైనే ఉన్న ఒక వ్యాన్, కారు, బైకులను ఢీ కొట్టింది. వ్యాన్ ని ఢీ కొట్టిన లారీ అటుగా వస్తున్న టూవీలర్‌ను, కారును కూడా వేగంగా ఢీకొట్ట్టింది. ఈ ఘటనలో టూ వీలర్‌లో ప్రయాణిస్తున్న తండ్రి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.

by Prasanna
Tirupathi road accident

తిరుపతి (Tirupathi) లో ఒక లారీ (Lorry) ఐదుగురు ప్రాణాలను బలి తీసుకుంది. నగరి మండలం ధర్మాపురం (Dharmapuram) దగ్గర వేగంగా ప్రయాణిస్తున్న ఒక లారీ అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ (శుక్రవారం) నగరి మండలం ధర్మాపురం వద్ద తిరుపతి నుంచి చెన్నై వెళ్తున్న సిమెంట్ లోడ్ లారీ ఐదుగురి ప్రాణాలను తీసింది. ఆ రోడ్డుపై వేగంగా దూసుకొస్తున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న టాటా ఏస్ వాహనాన్నిఢీకొట్టింది.

Tirupathi road accident

దాంతో ఆ రోడ్డుపైనే ఉన్న ఒక వ్యాన్, కారు, బైకులను ఢీ కొట్టింది. వ్యాన్ ని ఢీ కొట్టిన లారీ అటుగా వస్తున్న టూవీలర్‌ను, కారును కూడా వేగంగా ఢీకొట్ట్టింది. ఈ ఘటనలో టూ వీలర్‌లో ప్రయాణిస్తున్న తండ్రి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.

అక్కడితో ఆగని అదుపు తప్పిన లారీ ఆ హైవేపై మార్కింగ్ వర్క్ చేస్తున్న వారిని కూడా గుద్దుకుంటూ పోయింది. వీరిలో ఒకరు మరణించిచారు. అలాగే వేలూరుకు చెందిన మరో వ్యక్తి కూడా మృతి చెందారు. దీంతో ప్రమాదం జరిగిన స్పాట్ లోనే ఐదుగురు మరణించారు. మరో పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిని ప్రధమ చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment