Telugu News » Hyderabad : హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం..!

Hyderabad : హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం..!

ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆరా తీసిన పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

by Venu

హైదరాబాద్‌ (Hyderabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. వనస్థలిపురం (Vanasthalipuram)లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సుష్మా థియేటర్‌ (Sushma Theatre) సమీపంలో అతివేగంగా వచ్చిన ఓ టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది.

Road Accident: Bloody roads.. Seven dead..!

ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆరా తీసిన పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనలో మరణించిన వారు కూకట్‌పల్లికి చెందిన సతీశ్‌, వీరబాబుగా గుర్తించారు.

నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోన్నా, వాహనదారులు అవగాహన తెచ్చుకోవడం లేదు. ర్యాష్ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు కారణమవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు యూపీ (UP)లోని రాయ్‌బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై భార్య, ఐదేళ్ల కుమారుడితో వెళ్తున్న వీరేంద్ర అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టడమే కాకుండా చక్రాల మధ్యలో ఇరుక్కున్న బాధితుడిని మూడు కి.మీ లాక్కెళ్లడంతో అతడు మృతి చెందాడు. అతని భార్య, కుమారుడు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like

Leave a Comment