Telugu News » RK Roja: పవన్ తిక్క జనసైనికులు… లెక్క ప్యాకేజీ: మంత్రి రోజా

RK Roja: పవన్ తిక్క జనసైనికులు… లెక్క ప్యాకేజీ: మంత్రి రోజా

ఇప్పటికే పొత్తులో ఉన్న బిజెపితో చర్చించకుండానే... టీడీపీతో కలిసి వెళ్లాలన్న నిర్ణయం ఎలా తీసుకంటాడన్నారు.

by Prasanna
roja RK(1)

టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తుపై మంత్రి రోజా (Roja)ఘాటుగా స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తోడుదొంగలేనన్న విషయం ఈ పొత్తుతో క్లారిటీ వచ్చిందన్నారు. దీంతో చంద్రబాబు (Chandrababu) దత్తపుత్రుడు పవన్ అనీ ప్యాకేజీ కోసమే పనిచేసే నాయకుడనీ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ లో కలిసిన జనసేనాని పవన్ కల్యాణ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీచేస్తాయంటూ పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

roja RK(1)

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి రోజా పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను తీవ్రస్థాయిలో విమర్శించారు. తనను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటే చెప్పుతో కొడతానన్న పవన్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతాడన్నారు. ఇప్పటికే పొత్తులో ఉన్న బిజెపితో చర్చించకుండానే… టీడీపీతో కలిసి వెళ్లాలన్న నిర్ణయం ఎలా తీసుకంటాడన్నారు.

ప్యాకేజీల కోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడని ప్రజలకు అర్థమయ్యిందన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల ఈ ప్యాకేజీ స్టార్ ని ఓడించారన్నారు. తన సినిమాలోనే ‘నాకు కొంచం తిక్కుంది… దానికి లెక్కుంది’ అని పవన్ అంటాడు కదా… ఆయన తిక్క జనసైనికులు, లెక్క ప్యాకేజీ అన్నారు.

గతంలో అధికారం ఉంది కదాని ఏది పడితే అది మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు సాక్ష్యాధారాలతో దొరకిపోయి జైలు కెళ్లాడన్నారు. ఇప్పడు అదే దారిలో నారా లోకేష్ నడుస్తున్నాడనీ రేపు తనకీ ఇలాంటి పరిస్థితే ఎదురవక తప్పదన్నారు. నిజంగానే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరగలేదని, తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని భావిస్తే ఎందుకు దీనిపై సీబీఐ, ఈడీ విచారణ కోరడంలేదని భువనేశ్వరీ, లోకేష్ లను ప్రశ్నించారు.

You may also like

Leave a Comment