Telugu News » BRS : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం.. తప్పతాగి..!!

BRS : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం.. తప్పతాగి..!!

డ్రైవింగ్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించినట్టు పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు. దీంతో విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లగా.. ఎస్‌ఆర్‌నగర్‌ డివిజన్‌ ​​ఏసీపీ వైవీరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

by Venu

బేగంపేట (Begumpet) ప్రజాభవన్‌ (Praja Bhavan) వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బోధన్‌ బీఆర్‌ఎస్‌ (BRS) మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ కుమారుడు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు సమయంలో పోలీసులు అసలు నిందితుడిని తప్పించి.. మరొకరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Road Accident: Bloody roads.. Seven dead..!

డిసెంబర్ 23 అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. BMW కారులో ఉన్న షకీల్ కుమారుడు.. ఓవర్ స్పీడ్ తో ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ టైమ్ లో కారులో ఇద్దరు యువకులతోపాటు ముగ్గురు యువతులు ఉన్నట్లు కెమెరాలో రికార్డ్ అయింది. అయితే కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అయినా…అతన్ని తప్పించి మరో యువకుడిపై కేసు పెట్టినట్లు ఆరోపణలున్నాయి.

అబ్దుల్ ఆసిఫ్ కారును డ్రైవ్ చేసినట్లు కేసు నమోదైంది. కారు బీభత్సం ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. మరోవైపు డ్రైవింగ్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించినట్టు పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు. దీంతో విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లగా.. ఎస్‌ఆర్‌నగర్‌ డివిజన్‌ ​​ఏసీపీ వైవీరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సోహెల్ పరారీలో ఉన్నాడని… అతడి కోసం గాలిస్తున్నామని వివరించారు. గతంలోనూ సోహెల్ ప్రమాదాలు చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు..

You may also like

Leave a Comment