Telugu News » Students Died in US: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి..!

Students Died in US: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి..!

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందడంతో పండుగ పూట ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతులు తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులుగా తెలుస్తోంది.

by Mano
Students Died in US: Two Telugu students died in America..!

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న విద్యార్థులు అక్కడ వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందడంతో పండుగ పూట ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతులు తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులుగా తెలుస్తోంది.

Students Died in US: Two Telugu students died in America..!

తెలంగాణ రాష్ట్రం(Telangana State) లోని వనపర్తి జిల్లా(Vanaparthi District)లో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి మృతిచెందాడు. గదిలో నిద్రపోయిన అతడు నిద్రలోనే మృతి చెందాడని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వనపర్తి పట్టణం 26వ వార్డుకు చెందిన గట్టు వెంకన్న కుమారుడు దినేష్.

హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్ళాడు. అక్కడ స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. శనివారం గదిలో నిద్రిస్తున్న దినేష్ నిద్రలోనే మృతి చెందాడు. దాంతో దినేష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దినేష్ భౌతికకాయాన్ని అమెరికా నుంచి తీసుకువచ్చేందుకు కుటుంబసభ్యులు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

తమ కుమారుడితో పాటు రూమ్‌లో ఉంటున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి కూడా మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని దినేష్ తండ్రి వెంకన్న తెలిపాడు. అయితే, యువకుల మరణాలకు కారణమేంటనే విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారన్నాడు. దీంతో ఇద్దరు విద్యార్థుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

You may also like

Leave a Comment