Telugu News » BJP : తెలంగాణ ప్రజల సొమ్ముతో రాహుల్ గాంధీకి ట్యాక్స్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్

BJP : తెలంగాణ ప్రజల సొమ్ముతో రాహుల్ గాంధీకి ట్యాక్స్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్

లోక్‌సభ ఎన్నికలు సమయం దగ్గర పడుతుంటంతో కమలనాథులు(Bjp Leaders) దూకుడు పెంచారు. బూత్ లెవల్ స్థాయిలో ప్రచార హోరును పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith sha) ఇచ్చిన టార్గెట్ ప్రకారం తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

by Sai
Tax to Rahul Gandhi with Telangana people's money.. Union Minister Kishan Reddy's sensational comments

లోక్‌సభ ఎన్నికలు సమయం దగ్గర పడుతుంటంతో కమలనాథులు(Bjp Leaders) దూకుడు పెంచారు. బూత్ లెవల్ స్థాయిలో ప్రచార హోరును పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith sha) ఇచ్చిన టార్గెట్ ప్రకారం తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Tax to Rahul Gandhi with Telangana people's money.. Union Minister Kishan Reddy's sensational comments

పార్లమెంట్ నియోజవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశం ఎలాంటి దుస్థితిలో ఉంటుందో ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పాలనను అందుకు ఉదాహరణగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి(kishan reddy) మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 19న ఆయన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలోనే నిర్వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గ సన్నాహక సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రజల సొమ్ముతో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడుతుందని ఆరోపించారు.
దేశంలో కాంగ్రెస్ సర్కార్ వస్తే మతకల్లోలాలు, బాంబ్ బ్లాస్టులు, మోసాలు, కరువులు, నీటి కష్టాలు ఎదురవుతాయని పేర్కొన్నారు.ప్రధాని మోడీ లేకపోతే దేశం అస్తమిస్తుందని సంచలన కామెంట్ చేశారు.పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ఓటర్లు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment