Telugu News » Congress : అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. ఆయనకే అవకాశం ఇస్తారా..?

Congress : అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. ఆయనకే అవకాశం ఇస్తారా..?

కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే నామినేషన్​ వేయనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్​నే స్పీకర్​గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్​కుమార్​ రెడ్డి ప్రభుత్వంలో.. ప్రసాద్​ కుమార్​కు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

by Venu
Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఆ పర్వం ముగిశాక, తాజాగా స్పీకర్​ నియామకంపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. ఈ మేరకు స్పీకర్​ ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈనెల 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు సభాపతి ఎన్నికను నిర్వహించనున్నారు.

ఈమేరకు స్పీకర్​ ఎన్నికకు (Speaker Election) నామినేషన్లును ఈనెల 13న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే అంతకు ముందు ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు, వికారాబాద్ ఎమ్మెల్యే, గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)ను స్పీకర్ గా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే నామినేషన్​ వేయనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్​నే స్పీకర్​గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్​కుమార్​ రెడ్డి ప్రభుత్వంలో.. ప్రసాద్​ కుమార్​కు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక (Assembly Election)ల్లో గడ్డం ప్రసాద్​ వికారాబాద్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రొటెం స్పీకర్ (ProTem Speaker)​గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికైన విషయం తెలిసిందే.. అనంతరం 100 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ను, ప్రొటెం స్పీకర్​గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రమాణ స్వీకారాన్ని నిరాకరించారు..

You may also like

Leave a Comment