Telugu News » Congress : కాంగ్రెస్ లో తగ్గని సెగ.. ఊరిస్తున్న మంత్రి పదవులు..!!

Congress : కాంగ్రెస్ లో తగ్గని సెగ.. ఊరిస్తున్న మంత్రి పదవులు..!!

నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మాత్రం ఎవరికీ బెర్త్ లభించలేదు. అందుకే ఈ జిల్లాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్, చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్‌కుమార్ అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం..

by Venu
Congress High Command Focus On Unsatisfied Leaders And Election Campaign

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ గెలుపుకోసం చేసిన పోరాటం అందరికీ తెలిసిందే.. అయితే గెలిచాక సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొనగా.. అధిష్టానం చేసిన మాయతో చివరికి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) సీఎం పదవి వరించింది. మిగిలిన పదవుల కోసం కాంగ్రెస్ (Congress) నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి మరో 11 మందికి మంత్రి పదవులు కేటాయించారు.

Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

అయితే కేబినెట్‌లో మరో ఆరుగురికి చోటు ఉండగా మొత్తం 15 మంది పోటీపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఓడినవాళ్లతోపాటు అస్సలు పోటీ చేయని వాళ్లు కూడా వీరిలో ఉండడం గమనార్హం. అయితే, అధిష్ఠానం మాత్రం జిల్లాలు, ప్రాంతాలు, సామాజికవర్గాల సమీకరణను బేరీజు వేసుకుని పదవులు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.. మరోవైపు మంత్రివర్గంలో ఇప్పటికే.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్‌ జిల్లాలకు ప్రాధాన్యం దక్కింది.

నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మాత్రం ఎవరికీ బెర్త్ లభించలేదు. అందుకే ఈ జిల్లాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్, చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్‌కుమార్ అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం..

మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ ప్రయత్నిస్తుండగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌కు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఇదే కోటాలో షబ్బీర్ అలీ కూడా పోటీపడుతుండటంతో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

అలాగే, మైనంపల్లి హన్మంతరావు, మధుయాష్కీ, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్టీ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ ఉన్న నేపథ్యంలో అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వీరంతా ఉన్నట్టు తెలుస్తుంది..

You may also like

Leave a Comment