Telugu News » Yadadri Temple : మూసివేయనున్న యాదాద్రి ఆలయం.. ఎప్పుడంటే..?

Yadadri Temple : మూసివేయనున్న యాదాద్రి ఆలయం.. ఎప్పుడంటే..?

చంద్ర గ్రహణానికి (lunar Eclipse) ముందు రోజు అంటే 27వ తేదీన రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో శరత్‌ పౌర్ణమి వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

by Venu

నిత్యం ఎందరో భక్తులు తమ బాధలు భగవంతుని వినిపిస్తారు. వారు, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఎన్నో పూజలు చేస్తారు. ఇలా తమ కోరికలతో దేవుడికి క్షణం తీరిక లేకుండా చేస్తున్న వేళ భగంతునికి కాస్త విరామం ఇవ్వడానికి 28న చంద్ర గ్రహణం రానుంది. ఈ నేపధ్యంలో యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీ నరసింహస్వామి (Lakshminarasimhaswamy) ఆలయాన్ని (Temple) అర్చకులు (Priests) మూసివేయనున్నారు.

ఈ నెల 28న సాయంత్రం నాలుగు గంటల నుంచి 29వ తేదీ ఉదయం వరకు యాదాద్రి ఆలయాన్ని మూసివేసి.. 29వ తేదీ వేకుజామున ఐదు గంటలకు తెరిచి సంప్రోక్షణ చేస్తామని ఆలయ ప్రధాన అర్చకులు నందింగల్ లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. మరోవైపు చంద్ర గ్రహణానికి (lunar Eclipse) ముందు రోజు అంటే 27వ తేదీన రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో శరత్‌ పౌర్ణమి వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

కాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడ గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్టు తెలిపారు. ఇకపోతే అశ్విని మాసం పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవిస్తుందని, ఈ నెల 28వ తేదీన అర్ధరాత్రి 1.06 గంటలకు ప్రారంభమై.. 2.22 గంటల వరకు ఉంటుందని అర్చకులు తెలిపారు. ఈ గ్రహణ సమయం గంట 16 నిమిషాల పాటు ఉంటుందని, దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. మరోవైపు ఇండియాలో 2023లో కన్పించే ఏకైక గ్రహణం ఇదే కావడం విశేషం..

You may also like

Leave a Comment