Telugu News » AIMIM CHIEF : ‘నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు’.. ఓవైసీ సంచలన కామెంట్స్!

AIMIM CHIEF : ‘నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు’.. ఓవైసీ సంచలన కామెంట్స్!

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ అసదుద్దీన్ ఓవైసీ(MIM Cheif Asaduddin Owaisi) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలు వచ్చాయంటే ఓవైసీ బ్రదర్స్‌ వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు.

by Sai

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ అసదుద్దీన్ ఓవైసీ(MIM Cheif Asaduddin Owaisi) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలు వచ్చాయంటే ఓవైసీ బ్రదర్స్‌ వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు. ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి విజయం సాధించడం వీరికి పారిపాటిగా మారింది.

'They are threatening to kill me'.. Owaisi's sensational comments!
తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. తనను చంపుతానని సోషల్ మీడియా వేదికగా బెదిరింపు మెసెజేస్ వస్తున్నాయని పేర్కొన్నారు.

ఇటీవల మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ జైలులో శిక్షఅనుభవిస్తూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓవైసీ యూపీకి వెళ్లి గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపు మెసెజేస్ వస్తున్నాయని తెలిపారు.

కానీ, నేను అంత ఆశామాషీగా చచ్చేవాడని కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకేమైనా జరిగితే మీరే బాధ్యులని అన్నారు. కాగా, ఓవైసీ చేసిన కామెంట్స్‌పై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఘాటుగా స్పందించారు.

ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ఆరు హత్యలు చేసిన ముక్తార్ అన్సారీ ఇంటికి అసదుద్దీన్ ఓవైసీ ఎలా వెళ్తారని ప్రశ్నించారు. మరి హైదరాబాద్‌లో చనిపోయిన వారి కుటుంబాలను ఓవైసీ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియా బెదిరింపులకే భయపడిపోతున్నారని మాధవీ లత ఎద్దేవా చేశారు. తన యుద్ధం ఓవైసీతోనే అని ఆమె ప్రకటించారు. అసదుద్దీన్‌తో గట్టిగా కోట్లాడుతున్నందునే తన కార్యకర్తల విజ్ఞప్తి మేరకు కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించిందని మాధవీలత తెలిపారు.

You may also like

Leave a Comment