వేంకటేశ్వర స్వామి భక్తులకు ఐఆర్సీటీసీ(IRCTC) శుభవార్త తెలిపింది. తిరుపతికి వెళ్లాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో తీసుకువచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ‘గోవిందం’(Govindam) పేరుతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజులు రెండు రాత్రుల ఈ టూర్లో తిరుమలతో పాటు తిరుచానూరు ఆలయాలను సందర్శించే అవకాశాన్ని కల్పించారు.
డిసెంబర్ 9న ఈ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. ఈ టూర్ హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. సికింద్రాబాద్, నల్గొండ స్టేషన్లలో కూడా స్టాప్లు ఏర్పాటు చేసింది. మొదటి రోజు 12734 నెంబరు గల రైలు లింగంపల్లి నుంచి సాయంత్రం 05:25 గంటలకు బయలుదేరుతుంది. 06:10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ గోవిందం టూర్ ప్యాకేజీలో వివిధ ధరలు అందుబాటులో ఉన్నాయి. ప్రామాణిక తరగతిలో ఒకే ఆక్యుపెన్సీ రూ.4940, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 3800, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3800గా నిర్ణయించబడింది. కంఫర్ట్ క్లాస్ చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6790. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న వారికి ప్రత్యేక ధరలు నిర్ణయించారు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తొలిరోజు సాయంత్రం ప్రయాణం ప్రారంభమై రెండవ రోజు ఉదయం 05:55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. పికప్ చేసి హోటల్కు తీసుకెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అవుతారు. ఉదయం 8 గంటలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత హోటల్కు చేరుకుని భోజనం ఉంటుంది. ఆ తర్వాత తిరుచానూరు ఆలయ దర్శనం కల్పిస్తారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 06.25 నిమిషాలకు ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణంలో ఉంటారు. ఆ తరువాత 3వ రోజు టూర్ నల్గొండకు తెల్లవారుజామున 03:04, సికింద్రాబాద్ స్టేషన్ 05:35, లింగంపల్లి స్టేషన్ 06:55కి చేరుకోవడంతో ఈ పర్యటన ముగుస్తుంది.

అధికార పీఠం అరచేతిలోకి రావడానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ప్రధాన పార్టీలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. కాగా ఓటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారి (Election Officer) వికాస్ రాజ్ (Vikas Raj)తెలిపారు. రేపు ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపిన ఎన్నికల అధికారి.. సాయంత్రం 5గంటలకు ఫలితాలను వెల్లడిస్తామన్నారు..

అయితే ఇప్పటి వరకు అధికారం తమదే అనే ధీమాలో బీఆర్ఎస్ (BRS) ఉన్నదన్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న గులాభి బాస్ కు.. తాను చేసిన రాజశ్యామల యాగం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో అని అనుకుంటున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో (southern states) వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి (CM) అయిన చరిత్ర ఉందా? అని గమనిస్తే.. అలాంటి చరిత్ర ఇప్పుడు మొదలైతేనే తెలంగాణ రాజకీయం కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు.

