Telugu News » Revanth-Reddy : కేసీఆర్ కు అధికారం ఇస్తే ప్రాణాలే కాదు.. కిడ్నీలను కూడా అమ్ముకుంటారు..!!

Revanth-Reddy : కేసీఆర్ కు అధికారం ఇస్తే ప్రాణాలే కాదు.. కిడ్నీలను కూడా అమ్ముకుంటారు..!!

బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే నిధులు కేటాయించిందని రేవంత్ తెలిపారు. అనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి, రోడ్డు వేసిందని రేవంత్ వివరించారు.

by Venu
Revanth Reddy strong counter to ktr over Welfare Schemes dispute

తెలంగాణలో ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రచారంలో దూకుడు పెంచిన పార్టీలు విమర్శించుకోవడంలో ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth-Reddy) బీఆర్ఎస్ (BRS) నేతలపై విరుచుకు పడుతున్నారు. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan-Reddy)పై కీలక వ్యాఖ్యలు చేశారు.

tpcc-revanth-reddy-strong-counter-to-minister-ktr

నిరంజన్ రెడ్డి నీళ్ల నిరంజన్ కాదు.. కమీషన్ల నిరంజన్ అని రేవంత్ ఆరోపించారు.. వేల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌజ్ లు కట్టుకుంటుంటే… నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌజ్ లు కట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఉద్యమ టైమ్ లో ఏమీ లేదని చెప్పిన నిరంజన్ కు వందల ఎకరాలు ఎక్కడివని ప్రశ్నించారు. గుడి, బడి తేడా లేకుండా కబ్జా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే నిధులు కేటాయించిందని రేవంత్ తెలిపారు. అనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి, రోడ్డు వేసిందని రేవంత్ వివరించారు. తెలంగాణ రాక ముందు.. వచ్చాక కూడా పాలమూరు జిల్లా అభివృద్ధిలో వెనుకబడే ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల ఇండ్లల్లో మాత్రమే కనకవర్షం కురిసిందన్న రేవంత్.. కేసీఆర్ (KCR) అవినీతికి నిదర్శనం కుప్పకూలిన కాళేశ్వరం అని ఆరోపించారు.

పాలమూరు జిల్లాలో వనరులు ఉన్నా.. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదని రేవంత్ తెలిపారు. రాష్ట్రానికి పాలమూరు బిడ్డ నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలని స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు మూడోసారి అధికారం ఇస్తే ఆయన మనవడికి కూడా మంత్రి పదవి ఇస్తాడంటూ సెటైర్ వేశారు. పదేళ్లు బీఆర్ఎస్ నాయకులు దండుపాళ్యం ముఠా మాదిరిగా దోచుకున్నారని, ఈ సారి అవకాశం ఇస్తే ప్రజల ప్రాణాలే కాదు.. కిడ్నీలను కూడా అమ్ముకుని.. ప్రజలను బలిపశువులను చేస్తారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

You may also like

Leave a Comment