Telugu News » Chamala Kiran Kumar : సవతి తల్లి సలాం పెడితే.. కన్నతల్లికి సున్నం పెట్టిన పైలట్ రోహిత్ రెడ్డి..!!

Chamala Kiran Kumar : సవతి తల్లి సలాం పెడితే.. కన్నతల్లికి సున్నం పెట్టిన పైలట్ రోహిత్ రెడ్డి..!!

రోహిత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చామల ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడానికి సిగ్గుండాలి ఆ నా కొడుకులకి అంటున్న మహా ప్రతివత పైలట్ రోహిత్ రెడ్డి.. నీ మాటలు వింటుంటే ప్రతివత పరమాన్నం వండితే తెల్లారే వరకు సల్లార లేదంట అంతటి ప్రతివతవు నీవు అనిపిస్తుంది అని చామల కిరణ్ విమర్శించారు.

by Venu

తాండూరు (Tandur) ఎమ్మెల్యే (MLA) పైలెట్ రోహిత్ రెడ్డి ( Pilot Rohit Reddy)పై టీపీసీసీ (TPCC) ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేసారు. పైలెట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) పార్టీ మారిన బీఆర్ఎస్ (BRS) నేతలపై కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భంగా.. చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. అమ్ముడు పోయిన కొడుకుల్లారా? ఖబర్దార్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన రోహిత్‌రెడ్డి ఒక్క సారి నీ గతాన్ని గుర్తు చేసుకో అని చామల అన్నారు.

రోహిత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చామల ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడానికి సిగ్గుండాలి ఆ నా కొడుకులకి అంటున్న మహా ప్రతివత పైలట్ రోహిత్ రెడ్డి.. నీ మాటలు వింటుంటే ప్రతివత పరమాన్నం వండితే తెల్లారే వరకు సల్లార లేదంట అంతటి ప్రతివతవు నీవు అనిపిస్తుంది అని చామల కిరణ్ విమర్శించారు.

నిజంగా నీవు నిజమైన నాయకుడివి అయితే నిన్ను కన్న తల్లి ఎవరు? నువ్వంటున్న బీఆర్ఎస్ పార్టీనా లేక కాంగ్రెస్ పార్టీ నా? అంటూ కిరణ్ ప్రశ్నించారు. 2018లో నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని మరిచావా.. చేయి గుర్తు మీద గెలిపించి నిన్ను అసెంబ్లీకి పంపితే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ని మరిచిన నువ్వు కన్నతల్లి ఎవరో సవితి తల్లి ఎవరో చెప్పు అంటూ కిరణ్ మండిపడ్డారు..

కన్నతల్లిని మోసం చేస్తున్న నువ్వు.. నిన్ను నమ్మిన తాండూరు ప్రజల పైన కపట ప్రేమ చూపించకని కిరణ్ పేర్కొన్నారు. ఇవన్నీ చాలవు అన్నట్టు ఇటీవలే బీజేపీతో కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకొని కేసీఆర్ ఇంటలిజెన్స్ కి దొరికి ప్రగతి భవన్లో బందీ అయిన దొంగవి నువ్వని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా మాట్లాడారు..

దొంగే దొంగ దొంగ అన్నట్టున్న నీ యవ్వారం తాండూరు ప్రజలకు అర్థమైందని కిరణ్ కుమార్ అన్నారు. నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు ఎంతో దూరంలో లేదు.. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని కిరణ్ కుమార్ హెచ్చరించారు.. 40వేల కోట్ల కమీషన్ ప్రాజెక్టు…కాళేశ్వరం కుంగిందని పేర్కొన్న చామల.. అవినీతి సామ్రాట్ కేసీఆర్…ఇక నీ ప్రభుత్వానికి మూడిందని కేసిఆర్ పై ఫైర్ అయ్యారు.. కాళేశ్వరం జలాల్లో నీ పార్టీని కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చామల కిరణ్ విమర్శించారు.

You may also like

Leave a Comment