Telugu News » Road accident: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు..11 మంది మృతి!

Road accident: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు..11 మంది మృతి!

ఘటనలో 11 మంది మృతి అక్కడికక్కడే మరణించారు.

by Sai
truck rams bus on jaipur agra natiional highway

రాజస్థాన్(Rajastan) లోని జైపూర్(Jaipur) -ఆగ్రా ( Agra) జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సు(Bus)ను వెనకాల నుంచి వచ్చి ఓ ట్రక్కు(Truck) ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు.

truck rams bus on jaipur agra natiional highway

వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ నుంచి ఓ ప్యాసింజర్ బస్సు పలువురిని ఎక్కించుకొని మథుర వెళ్తోంది. అయితే ఆ బస్సు జైపూర్-ఆగ్రా రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో భరత్‌పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలో అదుపుతప్పింది. దీంతో ఆ బస్సును హైవేపై ఉంచారు. అయితే వెనకాల నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది.

ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది మరణించారు. 12 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. అలాగే మృతదేహాలను హాస్పిటల్ లోని మార్చురీకి తీసుకెళ్లామని ఎస్పీ భరత్‌పూర్ మృదుల్ తెలిపారు.

మంగళవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లాలో జీపు బస్సును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. హనుమాన్‌గఢ్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లఖోవాలీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నంద్రం జాట్ (70), నీతూ జాట్ (60), దీపు జాట్ (13), అర్జున్ జాట్ (40)గా గుర్తించారు. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

You may also like

Leave a Comment