Telugu News » Vijaya Shanthi : అవినీతి బీఆర్ఎస్‌కు బీజేపీ కొమ్ము కాయడం దౌర్భాగ్యం…..!

Vijaya Shanthi : అవినీతి బీఆర్ఎస్‌కు బీజేపీ కొమ్ము కాయడం దౌర్భాగ్యం…..!

అవినీతి బీఆర్ఎస్ సర్కార్‌కు బీజేపీ కొమ్ము కాయడం దౌర్బాగ్యమని దుయ్యబట్టారు. ప్రజలు చచ్చిపోయినా, పంట పొలాలు మునిగిపోయినా పర్వాలేదనుకునే వ్యక్తి కేసీఆర్ అంటూ ఆమె ధ్వజమెత్తారు.

by Ramu

దోపిడీలో కేసీఆర్ కుటుంబం (KCR Family) బరితెగించిందని కాంగ్రెస్ నేత విజయ శాంతి (Vijaya Shanthi) మండిపడ్డారు. అవినీతి బీఆర్ఎస్ సర్కార్‌కు బీజేపీ కొమ్ము కాయడం దౌర్బాగ్యమని దుయ్యబట్టారు. ప్రజలు చచ్చిపోయినా, పంట పొలాలు మునిగిపోయినా పర్వాలేదనుకునే వ్యక్తి కేసీఆర్ అంటూ ఆమె ధ్వజమెత్తారు. ఇలాంటి దోపిడీ చేసిన కేసీఆర్ కుటుంబం ఇంకా ఈ రాష్ట్రానికి కావాలా..? ఆమె ప్రశ్నించారు.

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే అని ఆమె ఆరోపించారు. ఎన్ని అడ్డదారులు తొక్కైనా బీఆర్ఎస్‌ను గెలిపించాలని కాషాయ పార్టీ చూస్తోందన్నారు. కేసీఆర్ 10 ఏండ్ల దోపిడీ, అరాచకాల పాలన నుంచి విముక్తి కలిపించేలా ఓటర్లు గొప్ప తీర్పను ఇవ్వాలని కోరారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో ఇచ్చే తీర్పు ప్రజల తలరాతను, వారి భవిష్యత్ ను మార్చేలా ఉండాలన్నారు.

వరంగల్ ప్రజలను కూడా మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకుండా, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులను కల్పించారంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ పాఠాలు నేర్పించాలని అన్నారు. అది వరంగల్ నుంచే మొదలు పెట్టాలన్నారు.

బీఆర్ఎస్‌ను రెండు సార్లు గెలిపించి మోసపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్‌ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కరికీ కూడా ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియా కుటుంబాన్ని గద్దె దించాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కుమార్తె (ఎమ్మెల్సీ కవిత) అరెస్ట్ కాకుండా చూసుకున్నారని ఆరోపించారు

You may also like

Leave a Comment