Telugu News » Vinod Kumar: ‘బండి సంజయ్‌, వినోద్ కుమార్ మధ్యే పోటీ’…!

Vinod Kumar: ‘బండి సంజయ్‌, వినోద్ కుమార్ మధ్యే పోటీ’…!

ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట(Jammikunta) లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకర్స్‌తో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గొంతుక వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

by Mano
Vinod Kumar: 'Competition between Bandi Sanjay and Vinod Kumar'...!

కరీంనగర్(Karimnagar) ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్(Bandi Sanjay), వినోద్ కుమార్(Vinod Kumar) మధ్యే పోటీ ఉందని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట(Jammikunta) లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకర్స్‌తో ఆయన మాట్లాడారు.

Vinod Kumar: 'Competition between Bandi Sanjay and Vinod Kumar'...!

పార్లమెంటులో తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గొంతుక వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి 17మంది ఎంపీలతో తెలంగాణ ఎలా వస్తుందని విమర్శించారని గుర్తు చేశారు.

జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలను తీర్చిదిద్దేందుకు ఒక గొప్ప పథకంతో వస్తానని చెప్పుకొచ్చారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యక్రమంలో పాల్గొనని ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది ఒక బండి సంజయ్ మాత్రమే అని విమర్శించారు.

ఎంపీగా తనను గెలిపిస్తే సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్‌కు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. దీని ద్వారా పార్లమెంటు పరిధిలోని ఐదు నియోజకవర్గాల యువతకు గొప్ప అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇచ్చిన హామీలు ఒకటీ నెరవేర్చలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. గతంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తనకు మంచి మెజార్టీ వచ్చిందని ఈసారి కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరారు.

You may also like

Leave a Comment