Telugu News » Vinod Kumar: అప్పుడు గళమెత్తింది నేనే: బోయినిపల్లి వినోద్ కుమార్

Vinod Kumar: అప్పుడు గళమెత్తింది నేనే: బోయినిపల్లి వినోద్ కుమార్

కరీంనగర్(Karimnagar) పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం ఆయన వాకర్స్‌ను కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

by Mano
Vinod Kumar: Then it was me who got upset: Boinipalli Vinod Kumar

జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గళ మెత్తింది తానేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్(Vinod Kumar)తెలిపారు. కరీంనగర్(Karimnagar) పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం ఆయన వాకర్స్‌ను కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Vinod Kumar: Then it was me who got upset: Boinipalli Vinod Kumar

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌కు ఎంపీగా స్మార్ట్ సిటీ పనులకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. పది సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో అంబానీ ఆదానీల కోసం రూ.13లక్షల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది బీజేపీ కేంద్ర ప్రభుత్వమేనని దుయ్యబట్టారు.

బండి సంజయ్‌కి ఓటు ఎందుకు ఓటు వేయాలి? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. తాను గెలిస్తే బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేశారని, అతి త్వరలోనే బండి సంజయ్ సన్యాసం తీసుకునే రోజులు వస్తాయన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రైల్వే లైన్ తీసుకొచ్చింది తానే అని, మరికొద్ది రోజుల్లోనే సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు రైలుమార్గం సుగమనం అన్నారు.

కేంద్రంలో బీజేపీ మంత్రులను కలిసి అభివృద్ధి కోసం ఎన్నోసార్లు వివరించామన్నారు. ఏనాడూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అభివృద్ధిపై కేంద్ర మంత్రితో కలిసిన దాఖలాలు లేవని విమర్శించారు. తాను ఎంపీగా కరీంనగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. కరీంనగర్ ఎంపీగా మళ్లీ గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తా అన్నారు.

You may also like

Leave a Comment