Telugu News » Visakhapatnam : విశాఖ తీరంలో మత్తుపదార్థాల కలకలం.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ రెయిడ్స్..!

Visakhapatnam : విశాఖ తీరంలో మత్తుపదార్థాల కలకలం.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ రెయిడ్స్..!

ఓ ప్రైవేటు కంపెనీ వెయ్యి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలను నింపి సరఫరా చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ అధికారులు రెయిడ్స్ నిర్వహించారు.

by Venu

విశాఖ (Visakha) సాగరతీరంలో మత్తు పదార్థాలు కలకలం సృష్టించాయి.. ఇంటర్‌పోల్‌ సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ (CBI).. బ్రెజిల్‌ (Brazil) నుంచి విశాఖలోని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో 25 వేల కిలోల మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ గరుడ పేరుతో వీటిని సీబీఐ అండ్‌ కస్టమ్స్‌ అధికారులు సీజ్ చేశారు. జర్మనీ (Germany)లోని హ్యాంబర్గ్‌ (Hamburg) మీదుగా ఈ నెల 16న కంటైనర్‌ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు.

ఓ ప్రైవేటు కంపెనీ వెయ్యి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలను నింపి సరఫరా చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ అధికారులు రెయిడ్స్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం దాడులు ముగిసినట్లు సమాచారం..

ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ల్యాబ్‌ను పరిశీలించిన అధికారులు.. వైజాగ్ నుంచి ఫోరెన్సిక్‌ బృందాన్ని పిలిపించినట్లు సమాచారం.. వారు ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా వారం పది రోజుల్లో టెస్టు రిజల్స్‌ వస్తాయని అంటున్నారు.. అప్పుడు ఇందులో ఉన్నది నిజంగానే కొకైనా.. లేక కంపెనీ బుక్‌ చేసిన రా మెటీరియలా అనేది త్వరలోనే బయటపడనుంది.

You may also like

Leave a Comment