Telugu News » నుస్రత్.. అందంతో కాదు, అబద్ధాలతో ముంచింది..!

నుస్రత్.. అందంతో కాదు, అబద్ధాలతో ముంచింది..!

by sai krishna

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటి నుస్రత్ పై ఛీటింగ్ కేసు నమోదైంది. ఇండ్లు కట్టిస్తామంటూ మోసపూరిత హామీలు ఇచ్చి పలువురి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసు నిమిత్తం గరియాహట్ పోలీసులను ఆశ్రయించిన 429 మంది.. ఇళ్లు కట్టిస్తామంటూ తమ నుంచి దాదాపు రూ.28 కోట్ల మేర వసూలు చేశారని ఆరోపించారు. మరోవైపు, ఆమెపై అలిపోర్ కోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ అంశంపై ఎంపీ నుస్రత్ జహాన్ నోరు మెదపటం లేదు. ఈ విషయం పై ఉన్నతాధికారులు సైతం మౌనం వహిస్తున్నారు. నుస్రత్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఐదేళ్ల క్రితం ఓ సంస్థ ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ.5.55 లక్షలకు ట్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని ప్రకటనలు గుప్పించింది. వీటిని 2018లోగా కొనుగోలుదారులకు అందిస్తామని తెలిపింది. దీంతో దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదును చెల్లించారు.

ఇన్నేళ్లయినా ఇప్పటి వరకూ ఇళ్లకు అతి గతీ లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార తృణముల్ ఎంపీ కావడం వల్లే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు బీజేపీ నేత సంకూ దేబ్. బాధితులతో కలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కార్యాలయానికి వెళ్లారు. బాధితులు ఎన్ని సార్లు వెళ్లినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఈ అంశాన్ని ఈడీ పరిశీలించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆమెకు అనేక సార్లు సమన్లు జారీ చేసినా.. హాజరు కాలేదని ఆరోపించారు. బాధితులకు 48 గంటల్లోగా న్యాయం జరగకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.

గతంలో వివాహం విషయంలో తలెత్తిన వివాదంతో నుస్రత్ వార్తల్లో నిలిచారు. టర్కీలో వ్యాపారి నిఖిల్ జైన్ తో ఆమెకు వివాహం కాగా.. ఆ పెళ్లి చట్టబద్ధం కాదని కోల్ కతా న్యాయస్థానం ప్రకటించింది. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీపైనా వివాదం తలెత్తింది. పుట్టబోయే బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మాజీ భర్త నిఖిల్ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment