Telugu News » అయోధ్య రాముడికి మోడీ ఇచ్చిన ఈ కానుక ఏమిటో తెలుసా? ఇది ఎందుకు ఇచ్చారంటే?

అయోధ్య రాముడికి మోడీ ఇచ్చిన ఈ కానుక ఏమిటో తెలుసా? ఇది ఎందుకు ఇచ్చారంటే?

ప్రధాని మోడీ అయోధ్య రాముడికి ఇచ్చిన కానుక ఏమిటి?

by Sri Lakshmi

అయోధ్య రాముని యొక్క ఏడు రోజుల ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు బంగారు కర్రతో విగ్రహం యొక్క కన్నులను తెరిచి, హారతి మరియు షష్టాంగ ప్రణామం (సాష్టాంగ ప్రణామం)తో ఆచారాలను ముగించారు. , భారతదేశం అంతటా మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఇందుకు సంబంధించిన వేడుకలు కొనసాగుతూ వస్తున్నట్లు తెలిసిందే.

ఎర్రటి మడతపెట్టిన దుపట్టాపై ఉంచిన వెండి ‘చత్తర్’ (గొడుగు)తో ప్రధానమంత్రి ఆలయం వైపు ప్రవేశించారు. ఆ అయోధ్య రాముడికి ప్రధాని మోడీ వెండి గొడుగుని బహూకరించారు. అయితే.. గొడుగుని ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉంది. హిందూ దేవుళ్ళ విషయంలో గొడుగుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన కాలం నుంచి రాజులూ మరియు చక్రవర్తుల సింహాసనం పై భాగంలో వెండి పందిరి ఉండేది. రాముడు కూడా రఘువంశపు రాజు. అందుకే ఆయన రాజరికానికి చిహ్నంగా, ఆయనకు గౌరవం ఇస్తూ మోడీ వెండి గొడుగుని సమర్పించారు. రాజుకు క్షత్రపతి అనే బిరుదు ఇవ్వడానికి కూడా ఇలా వెండి గొడుగు పడుతుంటారు.

చాలా మంది హిందూ దేవతలకు కూడా శిరస్సు భాగం పైన గొడుగు పట్టడం మనం చూస్తూనే ఉంటాం. దీనిని మనం దేవతల సౌరభాన్ని గుర్తుగా భావిస్తూ ఉంటాం. విష్ణువు కూడా క్షీర సాగరంలో నిద్రిస్తూ ఉండగా.. మిగతా పాములు ఆయన శిరస్సు పైన గొడుగు పడతాయి. ఇక, లక్ష్మి దేవికి కూడా చెరోవైపు ఏనుగులు ఉండి తొండంతో నీటిని వెదకెళుతూ ఉంటాయి. ఇలా దేవతల శిరస్సు పైభాగంలో ఉండే గొడుగు ఆయా దేవతల యొక్క దైవిక శక్తిని సూచిస్తుంది.

You may also like

Leave a Comment