Telugu News » డీఎస్పీ నళిని గుర్తున్నారా..? ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారో తెలుసా..?

డీఎస్పీ నళిని గుర్తున్నారా..? ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారో తెలుసా..?

by Sravya
Dsp-Nalini

డీఎస్పీ నళిని అందరికీ గుర్తు వుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో చాలా మందికి తెలియదు 2012 తెలంగాణ ఉద్యమ కాలం లో నళిని తన డిఎస్పి కొలువుని వదిలేసింది. తెలంగాణ కోసం ఉద్యమించే వాళ్ల కోసం డ్యూటీ చేయలేనని ఉద్యోగాన్ని త్యాగం చేసింది. ఆమె రెండు సార్లు ఉద్యోగాన్ని రాజీనామా చేసింది. మరి ఇన్నాళ్లు ఈమె ఏమైపోయింది..? ఉద్యమ పార్టీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇప్పుడు అందరి విజ్ఞప్తులు వెల్లువత్తుతున్నాయి. ఆమెకి మళ్లీ పోస్ట్ ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి పేరిట అభ్యర్థనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ పేరిట ఎంతో మంది ఎన్నో సంపాదించారు. చాలా మంది తెలంగాణలో అధికారాన్ని అనుభవించారు నిజమైన ఉద్యమకారిణిగా పోరాడిన ఈమె కి న్యాయం జరగలేదని అందరికీ అనిపించింది. ఆమె పూర్తిగా ఒక భిన్నమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతోంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలని తన మిత్రుడు ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఆమె ఉద్యోగాన్ని రాజీనామా చేసి 12 ఏళ్లు అయింది. ప్రజల మెసేజ్ల ద్వారా ఆమె అందరికీ గుర్తుందని తెలిసిందని చాలా సంతోషమని అందరికీ కృతజ్ఞతలు అని రాసుకోచ్చారు.

Also read:

నేను ఇప్పుడు ప్రశాంత జీవితం గడుపుతున్నాను అందుకే జర్నలిస్టులు బైట్ కావాలి అని అడుగుతున్న ఒప్పుకోవట్లేదు అని చెప్పారు. ప్రస్తుతం ఆమె యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకులుగా జీవితాన్ని గడుపుతున్నారట. పూర్తి సాత్వికంగా మారిపోయారట. త్యాగి నుండి యోగిని అయ్యి పతాంజలి ద్వారా ఆయుర్వేదము యోగాలని ప్రచారం చేశానని రోగిని కూడా అయ్యి కోల్కున్నానని. ఇప్పుడు తపస్విని నిత్యాగ్నిహోత్రినీ అయ్యి సనాతన ధర్మం మూలధారమైన వేదం యజ్ఞముని ప్రచారం చేస్తున్నాను అని అన్నారు ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నానని ఆమె చెప్పారు.

You may also like

Leave a Comment