Telugu News » Revanth Reddy : కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది.. అందుకే బస్సు యాత్ర పేరుతో కొంగ జపం చేస్తున్నారు..!

Revanth Reddy : కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది.. అందుకే బస్సు యాత్ర పేరుతో కొంగ జపం చేస్తున్నారు..!

ఏనాడైనా మీ సమస్యలను అడిగేందుకు ఈటెల రాజేందర్ ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించిన రేవంత్.. వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు..

by Venu
CM Revanth

లోక్ సభ ఎన్నికల్లో సైతం విజయాన్ని ఆశిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు.. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)పై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆనాడు మీరు నన్ను ఆదరించడంవల్లే.. మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చానని తెలిపారు.

CM Revanth Reddy Orders To Enquiry On ORR Toll Tendersఈ ప్రాంత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న రేవంత్.. సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే మీ సమస్యలను పరిష్కరించేందు కృషి చేస్తానన్నారు.. నన్ను ఆశీర్వదించినట్లే… ఎల్బీ నగర్ (LB Nagar) నుంచి సునీతకు 30వేల మెజారిటీ ఇవ్వండని కోరారు.. అలాగే హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరించే బాధ్యత నాదని ప్రకటించారు.. మరోవైపు బీజేపీ పై విమర్శలు చేశారు..

ఏనాడైనా మీ సమస్యలను అడిగేందుకు ఈటెల రాజేందర్ ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించిన రేవంత్.. వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు.. కానీ బండి రాలే, ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.. అదేవిధంగా తెలంగాణ (Telangana)ను నిండా ముంచేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు..

పదేళ్లు ప్రధానిగా ఉన్న మోడీ (Modi) మనకు నిధులు ఇవ్వలేదు.. పరిశ్రమలు ఇవ్వలేదు…బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు.. ఇప్పుడేమో బీజేపీ కి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట అని రేవంత్ పేర్కొన్నారు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో జవాబు చెప్పాకే ఆయన తెలంగాణకు రావాలన్నారు..

దేవుడి పేరు చెప్పుకుని కొందరు బిచ్చమెత్తినట్లు… రాముడి పేరుతో ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డ రేవంత్ రెడ్డి (Revanth Reddy).. దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలన్నారు.. అలాగే కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది.. ఇక తిరిగి రాదని సెటైర్ వేశారు.. ఉద్యోగం ఊడిందనే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో కొంగ జపం చేస్తున్నారు…ఈ కొంగకు ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్లే అని తెలిపారు..

You may also like

Leave a Comment